మార్కాపురం బస్సు ప్రమాదంలో డ్రైవర్, ఓవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 26న జరిగిన ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు.
ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇప్పటివరకు అమలులో ఉన్న నరేగా నిబంధనలను మరో నెలపాటు కేంద్రం పొడిగించింది. దీంతో ఈనెలలో గరిష్ఠంగా పనులు చేసి లబ్ధిపొందాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఉంది. తదనుగుణంగా ఏప్రిల్ అంతా ముమ్మరంగా కూలీలకు పనిదినాలు కల్పించే విధంగా అన్ని జిల్లాల డ్వామా అఽధికారు లను ఆదేశించింది.
పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త నిల్వలను తొలగించే దిశగా లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ (పాత వ్యర్థాల నిర్వహణ) కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. స్వచ్ఛభారత్ 2.0లో భాగంగా మునిసిపాలిటీల్లో దీన్ని అమలు చేస్తున్నారు.
కనిగిరి మండలం బల్లిపల్లి వద్ద ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం ఉపక్రమించింది. తరగ తులు, ట్యుటోరియల్స్ గదుల నిర్మాణానికి మంగళవారం టెండర్లను ఆహ్వానించింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తరగతులు ప్రస్తుతం ఒంగోలులోని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద బుధవారం సామాజిక పింఛన్లను పంపిణీ చేయనుంది. వివిధ రకాలైన సామాజిక పింఛన్లు పొందుతున్న వారు ప్రకాశం జిల్లాలో 2,18,992 మంది ఉండగా వీరికి పింఛన్ సొమ్మును అందజేసేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.95.28 కోట్లను విడుదల చేసింది.
వచ్చే ఏడాది జరగనున్న భారత జన గణనలో భాగంగా గృహ గణనకు జిల్లాలో ఏర్పాట్లు చక చకా జరుగుతున్నాయి. కేంద్రప్రభుత్వ ఆదేశా లతో ఈసారి సమగ్రంగా గృహగణన నిర్వహిం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో బుధవారం నుంచి రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభంకానుంది. అందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది.
పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగు తున్నాయి. అద్దంకి పట్టణానికి సమీపంలోని కొండ వద్ద 960 కుటుంబాలకు టిడ్కో ఇళ్లు సిద్ధమవుతున్నాయి.
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఎం. విజయ సునీతను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలువడమే తె లుగుదేశం పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. ఇటీవల కంభం పట్టణానికి చెందిన ఇద్దరు పార్టీ కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, వారికి తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా కింద రూ.10లక్షల చెక్కులను ఆ కుటుంబాలకు అందించారు.