చెడు వ్యసనాలకు బానిసలైన వారు పగటిపూట తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకొని రాత్రి సమయాలలో వాటిని పగులగొట్టి బంగారు వస్తువులను చోరీ చేసి జల్సాలు చేస్తున్న ఇరువురు దొంగలను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.
గెలాక్సీపురి కేంద్రంగా ఇండస్ట్రియిల్ మిక్స్డ్ ఆయిల్ దందా కొనసాగుతోంది. మూడేళ్లగా అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మూడేళ్ల క్రితం అంటే 2022-23లో చీమకుర్తి నుంచి రామాయపట్నం పోర్టు పనులకు గ్రానైట్ రాళ్లు రోజుకు వందల సంఖ్యలో లారీలతో తరలించారు.
కూటమి ప్రభుత్వ సారథ్యంలో నూతనంగా ఏర్పడబోయే మార్కాపురం జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక 14వ వార్డులో శుక్రవారం సాయంత్రం నూతన జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతగా పాలాభిషేకం జరిగింది.
గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం గిద్దలూరు మండలం కొత్తకోట పంచాయతీలో రూ. 6,03,47,000 తో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
సాగు చేపట్టిన కొద్దిరోజులకే పైరు బెట్టకు రావడంతో రైతులు నీటితడులపై దృష్టి సారించారు.
దశాబ్దాల నుండి కనీస మరమ్మతులకు కూడా నోచుకోని పలు రోడ్లకు విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించడంతో అవి కొత్తరూపును సంతరించుకున్నాయి.
ల్లాలో వరి ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నామని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు.
మార్కాపురం పట్టణ పరిధిలోని ప్రధాన రహదారులు ప్రాంతాన్ని బట్టి గతంలో 40 నుంచి 80 అడుగుల వెడల్పుతో ఉండేవి. కాలక్రమంలో ఆక్రమణల పుణ్యమా అని రహదారులు కుంచించుకుపోయాయి.
మండలంలోని తూర్పుగంగవరం పంచాయతీ సోమవర్పాడులో 9వతరగతి చదువుతున్న బాలికకు జరుగుతున్న వివాహాన్ని మండల ప్రత్యేకాధికారి ఎ.కుమార్ ఆద్వర్యంలో అధికారులు గురువారం అడ్డుకున్నారు. తూర్పుగంగవరం జడ్పీహైస్కూల్ను విజిట్ చేస్తున్న సమయంలో ఓవిద్యార్థి అధికారుల వద్దకు వచ్చి 9వ తరగతి చదువుతున్న సోమవర్పాడు చెందిన ఎస్సీ కాలనీ బాలికకు వివాహం చేస్తున్నారని చెప్పారు.
ఉత్తమ ఫలితాల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సంకల్ప-2026ను ప్రణాళికాబద్దంగా అమలు చేయాలని గుంటూరు జోన్ విద్యాశాఖ ఆర్జేడీ జే పద్మ అన్నారు. స్థానిక ప్రభుత్వ కళాశాలను గురువారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు.