మండలంలోని మర్రీవేముల గ్రామంలో బోగస్ మస్టర్లపై మార్కాపురం ఏపీడీ నిర్మలాదేవి మంగళవారం విచారణ జరిపారు.
రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లకు తరలిస్తే కఠిన చర్యలు త ప్పవని జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. పట్టణంలోని మండల లెవెల్ స్టాక్ పాయింట్, పెట్రోల్ బంకుల్లో మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ముందుగా వ్యవసా య మార్కెట్ యార్డులోని రేషన్ గోదాం లో తనిఖీలు చేశారు.
మే 2వ తేదీన అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికి, ఆ సభను విజయవంతం చేద్దామ ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అ న్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అశోక్రెడ్డి మాట్లాడారు.
ఎస్సీ కార్పొరేషన్ ద్వా రా ప్రభుత్వం ఇస్తున్న రాయితీ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
విధుల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సికింద్రాబాద్ రైల్వే జోన్కు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ అధికారి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం దొనకొండ రైల్వేస్టేషన్ను ఆయన పరిశీలించారు. ప్రత్యేక రైలులో గుంటూరు నుంచి అన్నీ రైల్వేస్టేషన్లు, రైల్వేట్యాక్, సిగ్నలింగ్ వ్యవస్థలలో సమగ్ర భద్రతా తనిఖీలు చేస్తూ దొనకొండకు చేరారు.
ప్రభుత్వాలు ఉచితంగా అందజేస్తున్న సరుకుల తూకాల్లో మోసా లకు పాల్పడితే చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ ఉషారాణి హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఎఫ్సీఐ గోడౌన్ను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు.
తెలుగుదేశం నాయకుడు వీరయ్యచౌదరి హత్య కేసుకు సంబంధించి సూత్రధారులను గుర్తించి కీలక పాత్రధారులు, కిరాయి హంతకుల కోసం వేట ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా మొత్తం సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు ఒంగోలులోని ఒక హోటల్లో ఆరోజు మధ్యాహ్నం ఫుటేజీలో దొరికిన అంశాలపై ప్రత్యేక విచారణ కొనసాగిస్తున్నారు.
వైసీపీ పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రమంగా గాడిలో పెడుతూ వస్తోంది. అందుకు గ్రామ పంచాయతీలే నిదర్శనం. గతంలో పారిశుధ్య పనులకు సైతం అప్పులు చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అందుకు భిన్నంగా అందుబాటులో అవసరమైన స్థాయిలో ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి.
జిల్లాలో వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పలుమండలాల్లో మూడు మాసాలకుపైగా చినుకు లేకపోవడం, అంతకు ముందు ఈశాన్య రుతుపవనాల కాలంలో సగం మండలాల్లో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదవడం అందుకు కారణమైంది.
ఉపాధి హామీ పథ కం పనుల్లో బోగస్ మస్టర్లతో ప్రభుత్వ ధనాన్ని మెక్కేసిన ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్కు మండల అధికారులు సిఫార్సు చేశారు. సోమవారం మండలంలోని మర్రివేములలో 15 మంది ఉపాధి కూలీలు హాజరైతే 250కి మందికి పైగా వచ్చినట్లు దొంగ మస్టర్లు వేస్తున్నారని డ్వామా పీడీ జోస్ఫకుమార్కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.