Share News

Minister Anam: ఏపీ గత ఐదేళ్లలో ఆర్ధికంగా దెబ్బతింది

ABN , Publish Date - May 19 , 2025 | 07:03 PM

Minister Anam Ramanarayana Reddy: పారిశ్రామిక వేత్తలను‌ ప్రాధేయపడి మంత్రి నారా లోకేశ్ ఏపీకి పరిశ్రమలు తెస్తున్నారని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా ఒక్కటిగా కలిసి ప్రజల కోసం పనిచేస్తున్నారని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి పేర్కొన్నారు.

Minister Anam: ఏపీ గత ఐదేళ్లలో ఆర్ధికంగా దెబ్బతింది
Minister Anam Ramanarayana Reddy

నెల్లూరు: జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని.. ఆర్థికంగా దెబ్బతిన్నదని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి (Minister Anam Ramanarayana Reddy) ఆరోపణలు చేశారు. వైసీపీ (YSRCP) ప్రభుత్వంలో కేంద్ర, రాష్ట్రాల నిధులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. గ్రామాల్లో కనీసం తట్టెడు మట్టి వేసిన దాఖలాలు లేవని చెప్పారు. గతంలో ఎప్పుడూ రెండోపంటకు లక్షాయాభై వేల ఎకరాలకు మించి సాగునీరు ఇవ్వలేదని.. ఈ ఏడాది 5లక్షల 50వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని తెలిపారు. జల జీవన్ మిషన్‌లో ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చామని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి గుర్తుచేశారు.


ఇవాళ(సోమవారం) నెల్లూరులో మంత్రి ఆనం రామానారాయణరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామానారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలకు రూ.1200 కోట్ల నిధుల కేటాయింపులు చేశామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనదైన శైలిలో పనిచేస్తూ ఏపీ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా చేశారని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి ఉద్ఘాటించారు. గతంలో ఏ రోడ్డులో వెళ్లినా గుంతలు ఉండేవని చెప్పుకొచ్చారు. రోడ్లకు తమ ప్రభుత్వంలో రూ.850కోట్లు కేటాయించి, గుంతలు లేకుండా చేశామని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి వెల్లడించారు.


తమ ప్రభుత్వంలో బీపీసీఎల్, ఇండోసిల్ ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి తెలిపారు. రామాయపట్నం పోర్టుకు తోడుగా దుగరాజపట్నం పోర్టును తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దగదర్తిలో ఎయిర్‌‌పోర్టు నిర్మాణం ప్రారంభం కాబోతుందని చెప్పారు. తమ ప్రభుత్వంలో ప్రతి నెల ఒకటో తేదీన పెంచిన 68లక్షల ఫించన్లు పంపిణీ చేస్తున్నామని గుర్తుచేశారు. ఎన్ని కష్టాలున్నా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని అన్నారు. ఇవాళా, రేపో తల్లికి వందనం, బస్సుల్లో రాయితీలు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కార్యకర్తలు గ్రామాల్లో వివరించాలని సూచించారు. అప్పుడే ఏ పార్టీ కూడా టీడీపీ దరిదాపులోకి కూడా రాదని అన్నారు‌. పారిశ్రామికవేత్తలను‌ ప్రాధేయపడి మంత్రి నారా లోకేశ్ ఏపీకి పరిశ్రమలు తెస్తున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా ఒక్కటిగా కలిసి ప్రజల కోసం పనిచేస్తున్నారని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Kandula Durgesh: నంది అవార్డులపై మంత్రి దుర్గేష్ కీలక ప్రకటన

SIT Custody Petition: ఆ నలుగురిని కస్టడీకి ఇవ్వండి.. సిట్ పిటిషన్

Vizianagaram Terror Plot: అడవిలో బాంబు ట్రయల్స్.. ఉగ్ర కుట్రలో సంచనాలు

Nandigam Suresh: నందిగం సురేష్‌కు ఎదురు దెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - May 19 , 2025 | 07:14 PM