Share News

AP NEWS: ఏపీలో అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ABN , Publish Date - May 31 , 2025 | 03:02 PM

ఆదోనీలో అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. ఆదోనీలో శనివారం పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

AP NEWS: ఏపీలో అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
Cricket Betting Gang Arrested

కర్నూలు: జిల్లాలోని ఆదోనీలో క్రికెట్ బెట్టింగ్ ముఠా (Cricket Betting Gang) యథేచ్ఛగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇంటర్నెట్, మొబైల్ యాప్‌లు అందుబాటులోకి రావడంతో క్రికెట్ బెట్టింగ్ ముఠాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రధానంగా యువతకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ముగ్గులోకి దింపుతున్నారు. పలు బెట్టింగ్ యాప్‌ల ద్వారా యువతను ఇందులోకి లాగుతున్నారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి యువతను బెట్టింగ్ పెట్టేలా చేస్తున్నారు. డబ్బులు వస్తాయనే ఆశతో వందలు, లక్షల్లో యువత అప్పుచేసి మరీ బెట్టింగ్ పెడుతున్నారు. బెట్టింగ్‌లో యువత ఆర్థికంగా నష్టపోయేలా చేస్తున్నారు. బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోవడంతో యువత ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ ముఠాపై పోలీసులకు ఫిర్యాదులు అందండతో దీనిపై దృష్టి సారించారు. ఇవాళ(శనివారం) పలువురిని ఆదోనీ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోనీలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమక్షంలో మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠా సభ్యుల నుంచి రూ.91 లక్షల నగదు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడారు. బెట్టింగ్ వల్ల నిర్వాహకులకు మాత్రమే లాభం ఉంటుందని సామాన్యులు మోసపోతున్నారని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ యాప్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రికెట్ బుకీలు డబ్బు ఆశ చూపి యువతను క్రికెట్ బెట్టింగ్‌కు ప్రోత్సహించినా..బెట్టింగ్‌కి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పీఎస్సార్‌కు మరోసారి అస్వస్థత

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 03:09 PM