Home » Kurnool
కర్నూలు జిల్లాలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. తాళం వేసిన ఇళ్లల్లో దోపిడీ చేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. అందిన కాడికి దోచుకుని ఉడాయిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో భారీ చోరీ జరిగింది.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ద్వాక్రాసంఘాలు తీసుకువచ్చి, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుదేనని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన తర్వాతే మహిళలకు పూర్తిస్థాయిలో స్వతంత్రం వచ్చిందని అన్నారు. మహిళల ఆరోగ్య భద్రత కోసం దీపం పథకాన్ని సీఎం చంద్రబాబు తీసుకువచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
తొలకరి జల్లులు పడితే అన్ని చోట్లా రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతారు. కానీ ఇక్కడ మాత్రం కుటుంబాలు, కుటుంబాలు వజ్రాల వేటలో నిమగ్నమవుతాయి. వర్షపు జల్లులు తమకు అదృష్టం పండిస్తాయోమోనని ఆశగా అక్కడకి వచ్చిన వారు ఎదురుచూస్తారు.
రాజధాని అమరావతి మహిళలనుద్దేశించి సాక్షిమీడియాలో ప్రసారమైన విశ్లేషణపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. అన్ని జిల్లాల్లో నిరసనలకు దిగుతున్నారు అమరావతి మహిళలతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా విభాగాలు. పలు చోట్ల ఈ ఆందోళన అరెస్టులకు దారి తీసింది.
ఏపీలోని కర్నూలు జిల్లాలో నిర్మితమవుతోన్న పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దీనికి ఏపీని అభినందిస్తున్నానని ఆయన అన్నారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారని నంద్యాల డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహయాదవ్ తెలిపారు.
జనని సహకార సంఘం బ్యాంకు కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కోవెలకుంట్ల సీఐ హనుమంతనాయక్ తెలిపారు.
మండలంలోని మీదివేముల గ్రామంలో మళ్లీ ప్యాక్షన భగ్గుమంది. గురువారం రాత్రి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోయ రమేష్ నాయుడు (45) దారుణ హత్యకు గురి కావడం తెలిసిందే.
మంత్రులు, ఎమ్మె ల్యేలు, రెండు జిల్లాల ఎంపీలు, టీడీపీ ముఖ్యనేతలు, రైతుల సహకారంతో బ్యాంకు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన విష్ణువర్దనరెడ్డి అన్నారు.
తుంగభద్ర రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో నీరు పెద్దఎత్తున వస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 21.091 టీఎంసీల నీరు నిలువ ఉంది.