Home » Adoni
పేదల భూముల జోలికి వస్తే ఊరుకోనని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కబ్జాదారులకు హెచ్చరించారు.
కర్ణాటకలోని బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు మృతిచెందారు. మరో ఘటనలో అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో పనులు చేస్తుండగా ప్రమాదవశత్తూ భారీ రాతిబండ ఎగిరి పడటంతో రాజమాల్ అనే కార్మికుడు అక్కడిక్కడే మృతిచెందాడు.
పశ్చిమ ప్రాంతాలు అభివృద్ది చేందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని వైసీపీ ఎమ్మిగనూరు ఇన్చార్జి రాజీవ్ రెడ్డి డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లాలో కొత్తగా జిల్లా ఏర్పాటు చేస్తే ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటించాలని కుర్ణి కార్పోరేషన్ చైర్మన్ కామర్తి మిన్నప్ప ప్రభుత్వాన్ని కోరారు.
ఆదోనీలో అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. ఆదోనీలో శనివారం పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో బెట్టింగ్కు పాల్పడుతున్న బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
Kurnool Holi tradition: హోలీ సంబరాలను ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఏళ్లుగా వారి ఆచారాలను పాటిస్తూ హోలీ వేడుకలను ప్రజలు జరుపుకుంటున్నారు.
సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కర్నూలు జిల్లా, ఆదోనిలో మరో కేసు నమోదైంది. దీంతో పోలీసులు పీటీ వారెంట్పై గుంటూరు జిల్లా జైలు నుంచి కర్నూలుకు తరలించారు. విచారణ జరిపిన జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అపర్ణా పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్కు విధించారు.
కోసిగిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివసిస్తున్న వీరేష్ అనే యువకుడు కర్నూలు జిల్లా, ఆదోని మండలం, కుప్పగల్లులో తన బంధువుల పెళ్లికి కుటుంబసభ్యులతో వెళ్లాడు. రాత్రి పెళ్లి ఊరేగింపు సమయంలో వీరేష్ డీజే పాటలకు స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అందరూ ఆందోళన చెందారు. వీరేష్ మాట్లాడలేకపోవడంతో వెంటనే ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా
అధికారం కోల్పోయినా వైసీపీ నేతల అరాచకాలు ఆగట్లేదు.