AP News: ఆ వ్యాఖ్యలపై భారతిరెడ్డి స్పందించాలి.. కూటమి మహిళా నేతల ఫైర్
ABN , Publish Date - Jun 09 , 2025 | 01:13 PM
విజయవాడ పోలీసు కమిషనర్ని ఎన్డీఏ కూటమి మహిళా నేతలు సోమవారం కలిశారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజుపై సీపీకి ఫిర్యాదు చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని మహిళలను అభ్యతరకరంగా ధూషించిన కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ సీపీకి వినతి పత్రం ఇచ్చారు.

విజయవాడ: విజయవాడ పోలీసు కమిషనర్ని ఎన్డీఏ కూటమి మహిళా నేతలు (NDA Alliance Women Leaders) ఇవాళ(సోమవారం) కలిశారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజుపై సీపీకి ఫిర్యాదు చేశారు. రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతంలోని మహిళలను అభ్యతరకరంగా ధూషించిన కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ సీపీకి వినతి పత్రం ఇచ్చారు. సీపీని కలిసిన వారిలో టీడీపీ ఏపీ తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఆషా, బీజేపీ మహిళా నాయకురాలు బొడ్డు నాగలక్ష్మి, జనసేన నుంచి రవి సౌజన్య, కూటమి మహిళా నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా కూటమి మహిళా నేతలు మీడియాతో మాట్లాడారు. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. రైతులు చేసిన త్యాగానికి ఈ రోజు కృష్ణంరాజు, కొమ్మినేని మాటలు చాలా దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షి డిబేట్లో రాజధాని అమరావతి మహిళల గురించి అభ్యతరకరంగా మాట్లాడారని వాపోయారు. కృష్ణంరాజు, కొమ్మినేని అలా మాట్లాడటం సరికాదని చెప్పారు. సాక్షి మీడియాకి మొదటి నుంచి రాజధాని అమరావతిపై ఒక చిన్న చూపు ఉందని మండిపడ్డారు. రైతులు చేసిన త్యాగం మరువకూడదని చెప్పుకొచ్చారు కూటమి మహిళా నేతలు.
ఆ రాజధాని ప్రాంతంలోనే వైఎస్ భారతిరెడ్డి కూడా ఉన్నారని.. ఇప్పటి వరకు సాక్షి మీడియా ఎందుకు ఖండించలేదని కూటమి మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని మహిళల గురించి ఈ విధంగా మాట్లాడటం దారుణమని అన్నారు. ఇప్పటికే కొమ్మినేనిని అరెస్టు చేశారని..కృష్ణంరాజుని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేస్తామని విజయవాడ పోలీసు కమిషనర్ అన్నారని తెలిపారు. జగన్ తమ రాజధానిలో మీ భార్య, పిల్లలు కూడా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోని మాట్లాడాలని అన్నారు. జగన్ ఎలా మాట్లాడాలో మంత్రి లోకేష్ని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. సాక్షి మీడియా చైర్మన్గా వ్యవహారిస్తున్న భారతిరెడ్డి ఇప్పటివరకు ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని కూటమి మహిళా నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇవి కూడా చదవండి:
ఏఐసీసీ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే..
హమీల అమలుకు బాబు సర్కార్ వ్యూహరచన
For More AP News and Telugu News