Kesineni Chinni: 24 గంటల సమయమిస్తా నిరూపించండి.. జగన్ బ్యాచ్కు కేశినేని చిన్ని మాస్ సవాల్
ABN , Publish Date - May 08 , 2025 | 11:19 AM
Kesineni Chinni: మాజీ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబంలో ఐదు, ఆరు కంపెనీలు ఉన్నాయని తెలిపారు. అన్నీ లీగల్గానే ఉన్నాయని స్పష్టం చేశారు. విజయవాడ పాలేరుకు చాలా కంపెనీలు ఉన్నాయని, వాటి నిగ్గు కూడా తేల్చాలని కేశినాని నానిపై కేశినేని శివనాథ్ ఆరోపణలు చేశారు.

విజయవాడ: మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) చేసిన ఆరోపణలపై విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Chinni) కౌంటర్ ఇచ్చారు. రాజ్ కసిరెడ్డితో తనకు పరిచయం ఉందని.. నాలుగుసార్లు ఆయనను కలిశానని గుర్తుచేశారు. ఇద్దరం కలిసి ఒక కంపెనీ పెట్టామని దానిని డెవలప్మెంట్ చేద్దామని అనుకున్నామని అన్నారు. ఆ కంపెనీ డెవలప్మెంట్తో సహా ఆరునెలలు అన్నీ ఖర్చులు తానే పెట్టానని స్పష్టం చేశారు. ఇవాళ(గురువారం) విజయవాడలో తన కార్యాలయంలో కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాజ్ కసిరెడ్డికి సాన్నిహిత్యం, అతని వ్యవహారాలు చూసి తాను ఆ కంపెనీలో పెట్టిన పెట్టుబడులు కూడా వదిలేసి రాజ్ కసిరెడ్డితో దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. కేశినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం కుంభకోణంలో రూ.3200 కోట్ల లిక్కర్ స్కాం జరిగిందని, అందులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తేనని ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపణలు చేశారు. ఆ ప్యాలెస్లో రాజ్ కసిరెడ్డితో సహా నలుగురికే ఎంట్రీ ఉందని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్లో ఈ లిక్కర్ వ్యవహారం దృష్టి మరల్చడానికి ఐదుగురు సమావేశం అయ్యారని చెప్పారు. అందులో ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్పతో సహా విజయవాడ పాలేరు కూడా ఉన్నట్టు సమాచారం ఉందని ఆరోపించారు.
కేశినేని నానికి చెందిన ఇంటర్నేషనల్, దుబాయ్, అమెరికాలోని రెండు కంపెనీల ద్వారా హవాలా జరిగినట్లుగా వచ్చిన వార్తలను నిగ్గు తేల్చాలని.. అందుకు అవసరమైన ఖర్చు తానే పెట్టుకుంటానని అన్నారు. తన కుటుంబంలో ఐదు, ఆరు కంపెనీలు ఉన్నాయని తెలిపారు. అన్నీ లీగల్గానే ఉన్నాయని స్పష్టం చేశారు. విజయవాడ పాలేరుకు చాలా కంపెనీలు ఉన్నాయని, వాటి నిగ్గు కూడా తేల్చండి అంటూ కేశినాని నానిపై కేశినేని శివనాథ్ ఆరోపణలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు తాను సిద్ధమని ఎంపీ కేశినేని శివనాథ్ సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సీబీఐకి లేఖ రాస్తున్నానని అన్నారు. రూ. 3600 కోట్లు దోచేసిన జగన్ రెడ్డి సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేశినేని నాని, జగన్కు 24 గంటలు సమయం ఇస్తున్నాఆ ఆరోపణలను నిరూపించాలని కేశినేని శివనాథ్ మాస్ సవాల్ విసిరారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gottipati Ravikumar: అందుకే యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్తో ఒప్పందం.. తేల్చిసిన మంత్రి
AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ నేడు.. కీలక అంశాలపై చర్చ
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. వైరల్గా మాజీ ఆర్మీ చీఫ్ పోస్ట్
Donald Trump: ఆపరేషన్ సిందూర్పై డొనాల్డ్ ట్రంప్ స్పందన
Read latest AP News And Telugu News