Minister Nimmala Ramanaidu: జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగాన్ని అధ్వానంగా మార్చారు
ABN , Publish Date - May 13 , 2025 | 11:55 AM
Minister Nimmala Ramanaidu: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగానికి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు. ఇరిగేషన్ రంగాన్ని అధ్వానంగా మార్చారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

అమరావతి: వందల, వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం సరైన మెయింటెనెన్స్ కూడా చేయకుండా గాలికి వదిలేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆరోపించారు. ఇవాళ(మంగళవారం) ఏపీ సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు రూ.344 కోట్లు నిధులు మంజూరు చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం రూ.10లక్షలు దాటితే, కాలయాపన చేయకుండా, 7 రోజుల్లోనే పనులు పూర్తయ్యేలా, షార్ట్ టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. రూ.10లక్షల్లోపు ఉన్న పనులను, సాగు నీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్ట మట్టి కూడా తీయకపోగా, షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయకపోగా, గ్రీజు కూడా పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత జగన్ ప్రభుత్వం తప్పిదాలను తమ ప్రభుత్వం సరిచేసుకుంటూ, ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్లో రూ.90 కోట్లతోనూ, సెప్టెంబర్లో అత్యవసర పనులకు గానూ రూ.326 కోట్లతో నిర్వహణ పనులు చేశామని అన్నారు. ఇరిగేషన్ అధికారులు కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు స్వీయ పర్యవేక్షణ చేస్తూ, మే చివరి నాటికి పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Police Society Scam: భారీగా నిధుల దుర్వినియోగం.. బయటపడ్డ స్కాం
Gangamma Jatara: చిత్తూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర వేడుకలు
Pawan Kalyan: ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..
Sajjala Sridhar Reddy: సజ్జలను కస్టడీకి ఇవ్వండి
Nimmala Ramanaidu: నెలాఖరులోగా కాలువల మరమ్మతులు
For More AP News and Telugu News