Home » Nimmala Rama Naidu
తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోవాలనే దురుద్దేశాలు తమకు అప్పుడు, ఇప్పుడు లేవని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తెలుగు ప్రాంతాలు, తెలుగు ప్రజలు బాగుండాలి అన్నది తెలుగుదేశం పార్టీ విధానమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ప్రైవేట్ చేతుల్లో ఉన్న లిక్కర్ వ్యాపారాన్ని జగన్ తన చేతుల్లోకి తీసుకున్నారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. మద్యం తయారీ దగ్గర నుంచి అమ్మకం దాకా అంతా జగనే పర్యవేక్షించారని ఆరోపించారు. చిరు వ్యాపారుల దగ్గర కూడా ఆన్లైన్ సేవలు ఉంటాయని... కానీ వేల కోట్ల వ్యాపారం చేసే లిక్కర్ షాపుల్లో ఎందుకు పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.
Nimmala Ramanaidu Slams Jagan: 2027, డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని.. 2025, డిసెంబర్ నాటికి డయాఫ్రంవాల్ పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల మరోసారి స్పష్టం చేశారు. 45.72 మీటర్ల ఎత్తులో ఎలాంటి మార్పు లేదన్నారు.
రాయలసీమ ప్రజలు తనను ఘోరంగా ఓడించడంతో కక్ష పెంచుకున్న జగన్..
Payyavula Challenges Jagan: చంద్రబాబు ఎగిరిపోయే నాయకుడు కాదని.. ఎదిగి పోయే నాయకుడని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. ఎవరు ఎగిరిపోతారో.. ఎవరు ఎదిగిపోతారో చరిత్ర చెబుతోందని అన్నారు. తల్లి చెల్లిని పక్కన పెట్టిన వాడు జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Water Projects: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ప్రశ్నార్థకమైన పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందని అన్నారు.
చుట్టూ దట్టమైన కొండలు.. మదపుటేనుగుల ఘీంకారాలు.. తియ్యని.. పుల్లని రుచుల అనాస పళ్లు.. అమాయకంగా కనిపించే మట్టి మనుషులు.. వీటన్నిటితో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా ప్రజల గోడు ప్రభుత్వాలకు పట్టడం లేదు
గతంలో టీడీపీ పాలనలో 1,040 లిఫ్టుల ద్వారా సాగు నీరందిస్తే, వైసీపీ పాలనలో నిర్వహణ లేకపోవడం వల్ల 450 లిఫ్టులు మూలన పడ్డాయని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ అమలు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పేదరికాన్ని పారద్రోలేలా మార్గదర్శకుల సహకారంతో పీ4ను అమలు చేస్తున్నామని వెల్లడించారు.
అనుమతులన్నీ పొందాకే పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం నిర్మిస్తామని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టమూలేదన్నారు.