Share News

Anagani Satya Prasad: జగన్‌పై మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 03 , 2025 | 10:27 AM

ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చిన జూన్ 4వ తేదీని వైసీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ హితవు పలికారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు జరుగుతున్న మేలును చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని.. అందుకే అలవాటు ప్రకారం అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Anagani Satya Prasad: జగన్‌పై మంత్రి అనగాని సత్యప్రసాద్  సంచలన వ్యాఖ్యలు
Minister Anagani Satya Prasad

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై (YS Jaganmohan Reddy) మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satya Prasad సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలనకు సరిగ్గా ఏడాది క్రితం ప్రజలు ముగింపు పలికారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రజలను వేధించిన సైకో నేతకు చాచి కొట్టినట్లు బుద్ది చెప్పారని అన్నారు. ఐదేళ్ల పాటు ప్రజలకు చేసిన మోసానికి జగన్మోహన్‌రెడ్డి నిజానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని.. కానీ వెన్నుపోటు దినమంటూ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్.


ఇవాళ(మంగళవారం) అమరావతిలో మీడియాతో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్, వైసీపీ నేతలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చిన జూన్ 4వ తేదీని వైసీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు జరుగుతున్న మేలును చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని.. అందుకే అలవాటు ప్రకారం అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి, చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచిన జగన్‌ను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఆయన ఇదే వైఖరితో కొనసాగితే వైసీపీ పరిస్థితి గుండుసున్నాకు చేరుకుంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు చేశారు.


వారికి వెన్నుపోటు పొడిచింది జగనే: మంతెన రామరాజు

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ నేతలపై ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలకు కనిపించకూడదనే వైసీపీ నేతలు వెన్నుపోటు దినం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ(మంగళవారం) పశ్చిమగోదావరి జిల్లాలో మంతెన రామరాజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వెన్నుపోటు జగన్మోహన్‌రెడ్డి తాతా రాజారెడ్డి దగ్గర నుంచే ప్రారంభమైందని ఆరోపించారు. బీసీల దగ్గర నుంచి మైన్స్ రాజారెడ్డి లాక్కోవడం, బాబాయిని హత్య చేయడం అనేది వెన్నుపోటు అనరా అని ప్రశ్నించారు. బాబాయ్, చెల్లి, కుటుంబ సభ్యుల విషయంలో జగన్మోహన్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన వాతావరణం ఉందని తెలిపారు. రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో అభివృద్ధి చేసి చూపిస్తామని మంతెన రామరాజు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెద్దిరెడ్డి పిటిషన్‌పై కౌంటర్‌ వేయండి

తహసీల్దార్‌ కుటుంబం సేఫ్‌

For More AP News and Telugu News

Updated Date - Jun 03 , 2025 | 11:04 AM