CM Chandrababu: ఢిల్లీ ఏపీ భవన్ ఇష్యూ.. స్పందించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 13 , 2025 | 01:24 PM
CM Chandrababu: ఢిల్లీ ఏపీ భవన్ ఇష్యూపై సీఎం చంద్రబాబు మంగళవారం నాడు అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏపీ భవన్లో కొత్త నిర్మాణాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఢిల్లీ: ఢిల్లీ ఏపీ భవన్లో బాలాజీ మందిరం కూల్చివేతను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సంబంధిత అదికారులను ఆదేశించారు. నిన్న(సోమవారం) బాలాజీ మందిరం కూల్చివేతపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. ఢిల్లీ ఏపీ భవన్లో ఆక్రమణల తొలగింపు, ప్రార్థనా మందిరం తొలగింపు ప్రతిపాదన అంశంపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీ భవన్ స్థలాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకున్నాయి.
ఈ ప్రాంతంలో కొత్త భవనం నిర్మించేందుకు అవసరమైన చర్యలను ఏపీ యంత్రాంగం చేపట్టింది. ఏపీ భవన్ ప్రాంగణంలో 0.37 ఎకరాల్లో పలు ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. వాటి తొలగింపునకు సంప్రదింపుల ద్వారా, చట్టబద్దంగా గత నెల నుంచి తీసుకున్న చర్యలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు అదే ప్రాంతంలో ఉన్న రెండు ప్రార్థనా మందిరాలను కూడా తొలగించే ప్రక్రియ చేపట్టాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ప్రజల, మత సంస్థల మనోభావాలు దెబ్బతినే చర్యలు తీసుకోవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అక్కడ స్థానికులు ఏర్పాటు చేసుకున్న దేవాలయం తొలగింపు విషయంలో అభ్యంతరాలపై అధికారులను సీఎం చంద్రబాబు వివరణ కోరారు. ప్రార్థనా మందిరాల తొలగింపు విషయంలో సంయమనం పాటించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ముఖ్యమంత్రి సూచనలతో నిన్ననే నిర్మాణాల తొలగింపు ప్రక్రియను నిలిపివేశామని అధికారులు చెప్పారు. ఆయా మతాలకు చెందిన వారి అభిప్రాయలకు విరుద్దంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Police Society Scam: భారీగా నిధుల దుర్వినియోగం.. బయటపడ్డ స్కాం
Gangamma Jatara: చిత్తూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర వేడుకలు
Pawan Kalyan: ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..
Sajjala Sridhar Reddy: సజ్జలను కస్టడీకి ఇవ్వండి
Nimmala Ramanaidu: నెలాఖరులోగా కాలువల మరమ్మతులు
For More AP News and Telugu News