Share News

Pawan Kalyan: పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తాం: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jun 05 , 2025 | 02:40 PM

పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేద్దామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గురువారం అనంతవరంలోని ఏడీసీఎల్‌ పార్క్‌లో వనమహోత్సవంలో పవన్ కల్యాణ్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తానని పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు.

Pawan Kalyan: పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తాం: పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Kalyan

అమరావతి: కోటి మొక్కలు నాటి.. వాటిని సంరక్షించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యానించారు. అడవిలో కార్చిచుల నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తానని అన్నారు. మానవ జీవితంలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపారు. ఒకప్పుడు ఇంటి చిరునామాకు మొక్కలు, చెట్లు ఆనవాళ్లుగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కానీ, ప్రకృతిని ప్రేమించే వ్యక్తి మనకు సీఎంగా ఉన్నారని ఉద్ఘాటించారు పవన్ కల్యాణ్.


పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేద్దామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ(గురువారం) అనంతవరంలోని ఏడీసీఎల్‌ పార్క్‌లో వనమహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, మంత్రులు, హాజరయ్యారు. అనంతవరం పార్క్‌ సమీపంలో రాగి, వేప మొక్కలను చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ నాటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రమాణం చేశారు.


ఇవి కూడా చదవండి

మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవ్వండి.. సీఎం చంద్రబాబు పిలుపు

జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 02:51 PM