Home » Plants
మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. అలాగే జీవ వైవిధ్య పరిరక్షణ, భవిష్యత్ తరాలకు హరిత భూమిని అందించేందుకు మనమంతా సామూహిక బాధ్యతగా భావించాలని అభిప్రాయపడ్డారు.
పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేద్దామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గురువారం అనంతవరంలోని ఏడీసీఎల్ పార్క్లో వనమహోత్సవంలో పవన్ కల్యాణ్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తానని పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు.
ఈనెల 5న రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అనేక ప్రదేశాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల పొరుగున మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందించనున్నట్లు పేర్కొన్నారు.
ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ఆ కలను సాకారం చేసుకుంటారు. నిజానికి ఇంటిని పచ్చని పొదరిల్లుగా మార్చుకోవాలంటే కొద్దిగా ఆసక్తి, కొంచెం ప్రణాళిక ఉంటే సరిపోతుంది.
చాలామంది రోజ్మేరీని పెంచుకోవాలని అనుకున్నామొక్కలు దొరకడం లేదని అంటూ ఉంటారు. అయితే రోజ్మేరీని చిన్న రెమ్మ సహాయంతో కూడా పెంచవచ్చు.
వర్టికల్ ఫార్మింగ్ గురించి మనకు తెలుసు! నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచడమూ కొత్త కాదు!! కానీ.. ఈ రెండింటీకీ కృత్రిమ మేధను కూడా జోడిస్తే? పసిపాపల్లా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన మొక్కలను ఏఐ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఫొటోలు తీసి వాటికి ఏం కావాలో విశ్లేషిస్తూ, కావాల్సిన పోషకాలు ఎప్పటికప్పుడు అందేలా చేస్తే?
మదురై శుభశ్రీకి ఔషధ మొక్కల పెంపకమంటే కాలక్షేపం కాదు. ప్రాచీన వైద్య సంప్రదాయాల్ని పరిరక్షించే ఒక యజ్ఞం. అయిదువందలకు పైగా అరుదైన జాతులకు నెలవైన ఆమె ఔషధ వనం ఇప్పుడు పరిశోధనా విద్యార్థులకు అధ్యయన కేంద్రంగా మారింది.
మహానంది మండలం గాజులపల్లి ఆర్ఎ్సలో అటవీశాఖ శుక్రవారం ఘనంగా వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించింది.
పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సంరక్షించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు.
మొక్కలను పెంచడం ద్వారా ఆరోగ్యం తోపాటు ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరం ట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పాల్గొని మొక్కలు నాటారు.