Share News

Minister Satya Prasad: ఎంఎస్ఎంఈ పార్కులతో ఏపీ ఆర్థిక అభివృద్ధి

ABN , Publish Date - May 13 , 2025 | 02:26 PM

Minister Satya Prasad: ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు కారణంగా ఉపాధి కల్పన జరగడమే కాకుండా ఆర్థికంగానూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పారిశ్రామిక వేత్తలుగా మారే యువతను ప్రోత్సహించేందుకు పెట్టుబడి నిధిలో, విద్యుత్ బిల్లులతో పాటు చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

Minister Satya Prasad: ఎంఎస్ఎంఈ పార్కులతో ఏపీ ఆర్థిక అభివృద్ధి
Minister Anagani Satya Prasad

కాకినాడ: సీఎం చంద్రబాబు భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే నాయకుడని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satya Prasad) తెలిపారు. ఇవాళ(మంగళవారం) కాకినాడ జిల్లా పెద్దాపురంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. పెద్దాపురంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీయల్ పార్క్‌ను మంత్రి అనగాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు.


ఉపాధి కల్పనతోపాటు ఆర్థికంగా రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపేందుకు ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామిక వేత్త అనే నినాదాన్ని చంద్రబాబు ఇచ్చారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామిక వేత్తను తయారుచేయడం కోసమే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎస్ఎంఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గతంలో ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగి అని చంద్రబాబు పిలుపునిస్తే చాలా మంది నవ్వారని.. కానీ ఫలితాలను మనం గత 20 ఏళ్లలో చూశామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.


విజన్ 2047 ద్వారా స్వర్ణాంధ్ర సాధించాలంటే పారిశ్రామిక రంగంలోనూ ప్రగతి చాలా అవసరమని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు కారణంగా ఉపాధి కల్పన జరగడమే కాకుండా ఆర్థికంగానూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పారిశ్రామిక వేత్తలుగా మారే యువతను ప్రోత్సహించేందుకు పెట్టుబడి నిధిలో, విద్యుత్ బిల్లులతో పాటు చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Police Society Scam: భారీగా నిధుల దుర్వినియోగం.. బయటపడ్డ స్కాం

Gangamma Jatara: చిత్తూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర వేడుకలు

Pawan Kalyan: ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..

Sajjala Sridhar Reddy: సజ్జలను కస్టడీకి ఇవ్వండి

Nimmala Ramanaidu: నెలాఖరులోగా కాలువల మరమ్మతులు

For More AP News and Telugu News

Updated Date - May 13 , 2025 | 02:37 PM