Home » Sand Mafia
ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు.
రాష్ట్ర మినరల్ డెవల్పమెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఇసుక బజార్లలో ఇసుక అగ్గువకే దొరుకుతోంది. బహిరంగ మార్కెట్తో పోల్చితే టన్నుకు రూ.300 నుంచి రూ.500 వరకు తక్కువకే లభిస్తోంది.
ఇసుక తవ్వకాలపై అధికారుల పర్యవేక్షణ కరవైంది. అనుమతులు ఇచ్చేటప్పుడు చూపించే శ్రద్ధ ఆ తర్వాత ఉండడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు ఇసుక రీచ్లలో నిర్ణీత లోతుకు మించి తవ్వకాలు జరపడంతో వాటిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి.
వైసీపీ హయాంలో రూ.2,566 కోట్ల ఇసుక అక్రమాలకు సంబంధించి ఏసీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ అధికారుల, వైసీపీ నేతల పాత్రపై ఆధారాలు సేకరించి విచారణ ప్రారంభమైంది.
తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా కొత్త మార్గాలు, హైటెక్పద్ధతులతో జరుగుతోంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి ఎస్కార్ట్ వాహనాలు, మొబైల్ యాప్ల సహాయంతో ఇసుక దొంగతనం కొనసాగుతోంది.
కృత్రిమంగా ఇసుకకు కొరత సృష్టించడం, ఆ తర్వాత రేట్లు పెంచి అమ్ముకోవడం, నకిలీ వే బిల్లులు, నంబర్ ప్లేట్లు మార్చి ఇసుక రవాణా.. తదితర అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకురావాలని యోచిస్తోంది.
ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను విక్రయిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రూ. 1.20లక్షల విలువైన 60 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.
ఇసుక అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్ల లైసెన్సులను రద్దు చేస్తామని, కాంట్రాక్టు సంస్థలను బ్లాక్ లిస్టులో పెడతామని గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లాలోని తాడిచర్ల బ్లాక్-2 గోపాల్పూర్ ఇసుక రీచ్.. సాధారణంగా ఇక్కడ ఎవరైనా లారీ యజమాని ఇసుక నింపుకోవాలంటే వెబ్సైట్లో బుక్ చేసుకుని.. డబ్బు చెల్లించి ఆర్డర్ కాపీ (ఓఆర్డీ) తీసుకోవాలి. కానీ, ఈ రీచ్లో లోడింగ్ కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యం.
Andhra Pradesh News: నదీ గర్భంలోని ఇసుక తవ్వి తీసుకురావాలంటే కష్టమనుకున్నారేమో.. ఏకంగా నదిలోనే రోడ్డు వేసుకుంటున్నారు. నది మధ్య వరకు వాహనాలను తీసుకెళ్లి ఇసుక తవ్వి..