Home » Pahalgam Terror Attack
పహల్గాం ఉగ్రదాడి ఉదంతంలో రొమ్ములెదురొడ్డి నిలిచిన ధీరుడి ఆత్మకు శాంతి కలిగే సంఘటన ఇది. ఉగ్రమూక చేతిలో చిక్కుకున్న పర్యాటకులను రక్షించే ప్రయత్నంలో స్థానికుడైన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా మరణించిన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్కు రెండు వారాలు వారికి సమయం ఇచ్చినప్పటికీ ఉగ్రదాడులకు పాల్పడిన ముష్కరులపై ఒక్క చర్య కూడా తీసుకోలేదని అభిషేక్ బెనర్జీ చెప్పారు. పైగా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ ఆర్మీ అధికారులు పాల్గొనడాన్ని అంతా చూశామని అన్నారు.
ఉగ్రవాది జకీర్ రెహమాన్ లఖ్వీ పాక్ జైల్లో ఉండగానే తండ్రి అయ్యాడు.. ఇదీ.. పాకిస్థాన్ పాపాల బ్రతుకు అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. అల్జీరియా దేశం ముందు పాక్ చేస్తున్న దురాగతాల్ని కళ్లకు కట్టినట్టు వివరించారు అసద్.
ఏప్రిల్ 26న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రజలను కాల్చి చంపారని, ఇందుకు ప్రతిగా ఇస్లామాబాద్పై ఇండియా కఠిన చర్యలు తీసుకుందని ఎంజే అక్బర్ అన్నారు. దీంతో న్యూఢిల్లీతో ఇస్లామాబాద్ చర్చల ప్రస్తావన చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
యావత్ భారతావని నిర్ఘాంతపోయేలా చేస్తున్న ఘటనలివి. సాధారణ భారతీయులు పాకిస్తానీ ISI ఏజెంట్లుగా ఎలా మారుతున్నారానేది ఇప్పుడు భారత్ను కలవరపరుస్తోన్న అంశం.
పూంచ్ పౌరులు, అధికారులు చూపించిన సాహసం, దేశభక్తి యవద్దేశానికి స్ఫూర్తినిస్తుందని అమిత్షా ప్రశంసించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పిరికిపందల చర్య అని, ఏ ఒక్క ఉగ్రవాద చర్యను ఉపేక్షించరాదన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధాన నిర్ణయమని చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం కొలంబియా పర్యటన హాట్ హాట్గా సాగింది. ఆ దేశ గడ్డపైనే కొలంబియా స్పందించిన తీరును శశిథరూర్ తూర్పారపట్టారు.
Pahalgam Terror Attack: ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిల్ రజ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఆర్మీ ఎలా ఉగ్రవాదులకు సాయం చేస్తోంది.. పాకిస్తాన్లో ఉంటూనే వారి ద్వారా జమ్మూకాశ్మీర్లో ఎలా హింసకు పాల్పడుతోందో చెప్పారు.
పటేల్ మాట వినిపిస్తే ఉగ్రదాడులు జరగకుండా ఉంటాయన్నారు ప్రధాని మోదీ. 1947లో దేశ విభజన నిర్ణయంతో పాకిస్తాన్ ఉగ్రవాద పరంపర ప్రారంభమై, కశ్మీరు విషయంపై కఠిన రీతిలో బదులిస్తామని హామీ ఇచ్చారు.
కశ్మీర్కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగంపై పహల్గాం ఉగ్రదాడి ప్రభావం తీవ్రంగా పడిందని, ఈ నేపథ్యంలో పర్యాటకంపై ఆధారపడిన ప్రజలకు సంఘీభావంగా క్యాబినెట్ సమావేశాన్ని పహల్గాంలో ఏర్పాటు చేశామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.