Share News

Shashi Tharoor: అవును.. నిజమే, చివరకు మౌనం వీడిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్

ABN , Publish Date - Jun 19 , 2025 | 05:14 PM

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చివరకు మౌనం వీడారు. కాంగ్రెస్‌తో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. వాటి గురించి సమయం వచ్చినప్పుడు నేరుగా చర్చిస్తానన్నారు. అంతేకాదు, ఈ సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

Shashi Tharoor: అవును.. నిజమే, చివరకు మౌనం వీడిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Shashi Tharoor

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ, కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. పార్టీతో తనకు కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైనా తనను సంప్రదించినప్పుడు ఈ విభేదాలను ప్రైవేట్‌గా చర్చిస్తానని థరూర్ అన్నారు. 'నేను గత 16 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నాను. పార్టీతో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి.. నేను వాటిని పార్టీ లోపల చర్చిస్తాను. ఈ రోజు దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నేను కలుసుకుని మాట్లాడాలి, సమయం రావాలి, అప్పుడు దాని గురించి చర్చిస్తాను.' అని ఎంపీ థరూర్ కేరళ తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

ఇలా ఉండగా, ఈ నెల ప్రారంభంలో భారత ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ ఔట్ రీచ్ కార్యక్రమంలో శశిథరూర్ చురుగ్గా పాల్గొన్న సంగతి తెలిసిందే. అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ విదేశాలలో పహల్గాం దాడి, తర్వాత ఆపరేషన్ సిందూర్ తదితర పరిణామాల్ని.. ఉగ్రవాదంపై భారత స్టాండ్‌ను ప్రపంచానికి చాటి చెప్పారు శశిథరూర్. పలు దేశాల్లో పర్యటించి భారతదేశం మీద పాకిస్థాన్ చేస్తున్న పన్నాగాల్ని, కుట్రల్ని, భారత్ పడుతున్న ఇబ్బందుల్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు.

కాగా, జూన్ 10న, శశి థరూర్ ప్రధాని మోదీతో తన సమావేశాన్ని 'మంచి, ఉల్లాసమైన అనధికారిక' భేటీగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి మోదీ న్యూఢిల్లీలోని తన నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఆపరేషన్ సిందూర్ ఔట్ రీచ్ అఖిలపక్ష ప్రతినిధుల సభ్యులను కలిసిన అనంతరం శశి ఈ వ్యాఖ్యలు చేశారు.


అయితే, ఇలా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి శశిథరూర్ ఏకపక్షంగా మద్దతునిస్తూ అనేక ఫ్లాట్ ఫాంలలో మోదీ సర్కారుకి పూర్తి అనుకూలంగా మాట్లాడటం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడంలేదు. కొంతమంది కాంగ్రెస్ నాయకులైతే, శశిథరూర్‌ను భారతీయ జనతా పార్టీకి అధికార 'సూపర్ ప్రతినిధి' అని కూడా ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌తో విభేదాలు ఉన్నాయా అని విలేకరులు తాజాగా శశిథరూర్‌ని ప్రశ్నించారు. ఇక్కడ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటింగ్ కొనసాగుతున్నందున ఇప్పుడు దాని గురించి మాట్లాడటం ఇష్టం లేదని థరూర్ మీడియాతో అన్నారు. 'పోలింగ్ కొనసాగుతున్నందున ఆ సమస్యల గురించి (నాయకత్వంతో ఆయనకున్న విభేదాలు) మాట్లాడటానికి ఇది సమయం కాదు, అక్కడ నా స్నేహితుడు (కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యదాన్ షౌకత్) గెలవాలని కోరుకుంటున్నాను.' అని శశిథరూర్ స్పష్టం చేశారు.

అంతేకాదు, 'ప్రధానితో తాజా చర్చ.. ఎంపీల ప్రతినిధి బృందానికి సంబంధించిన విషయాలపై మాత్రమే జరిగిందని.. దేశానికి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, దేశంతో నిలబడటం మా బాధ్యత. దేశానికి నా సేవ అవసరమైనప్పుడు, నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని కూడా అని థరూర్ తేల్చి చెప్పేశారు.


ఇవి కూడా చదవండి:

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ

యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత

ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 19 , 2025 | 05:20 PM