Home » IMD
దేశంలో వర్షాలు మళ్లీ అందరిని తడిపేందుకు సిద్ధమయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికల ప్రకారం, ఈశాన్య భారత్ సహా పలు ప్రాంతాల్లో వచ్చే నాలుగైదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పడమటి గాలుల వేగంలో మార్పుల కారణంగా రాష్ట్రంలో ఆగస్టు 2 నుంచి 5వ తేది వరకు ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షం కురిసే అవకాశముంది. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరకోస్తా తీరం వెంట బలమైన ఈదురు గాలులు ఉంటాయని... ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
నగరాన్ని ముసురు కమ్మేసింది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు ముసురు, చిరుజల్లులతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, చిరువ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో రహదారులు బురదమయంగా మారాయి.
రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తోండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ క్రమంలో అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు.
మరికాసేపట్లో నగర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. జీహెచ్ఎంసీ సహా నగర పరిసర ప్రాంతాల్లో ...
ఆంధ్రప్రదేశ్లో మరో మూడ్రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం, పడమటి గాలుల వేగం కారణంగా రాష్ట్రంలో మంగళవారం నుండి ఆరు రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. 16 నుండి 17 వరకు చెన్నై సహా ఆరుజిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా మరోసారి వర్షాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అల్ప పీడన ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వానలు (Rain Alert) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
కన్నియాకుమారి జిల్లాలో గురువారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. కన్నియాకుమారిలోని మీనాక్షిపురం రోడ్డు, కోట్టార్ రోడ్డు, అసంబు రోడ్డు తదితర రహదారులలో మోకాలి లోతున నీరు ప్రవహించింది.