Home » CM Stalin
ఢిల్లీ నుండి రాష్ట్రంపై పెత్తనం చెలాయించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. సేలంలోని మోహన్కుమారమంగళం ప్రభుత్వ వైద్యకళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో రూ.880 కోట్లతో నిర్మించనున్న జౌళి పార్కుకు, రూ.100 కోట్లతో నిర్మించనున్న కొత్త గ్రంథాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధ, గురువారాల్లో సేలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సేలం జిల్లాలో ఆ రెండ్రోజులు డ్రోన్లపై నిషేధం విధించినట్లు కలెక్టర్ బృందాదేవి ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ప్రముఖ సినీ నటుడు, ‘మక్కల్ నీది మయ్యం’ అధినేత కమల్ హాసన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.
ఏం భయంలేవు.. మళ్లీ అధికారం మనదే.. అంటూ డీఎంకే పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆ పార్టీ కార్యకర్తలకు లేఖ రాశారు. జూన్ ఒకటో తేదీ ఉదయం 9 గంటలకు మదురైలో పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. నగల తాకట్టుపై ఆర్బీఐ నిబంధనలు తొలగించాలని కోరుతూ.. ఆయన ఈ లేఖ రాశారు. నగల తాకట్టుకు కఠిన నిబంధనలు అమలు చేయడం భావ్యమేనా అని ఆయన ప్రశ్నించారు.
శాసనసభ స్పీకర్ అప్పావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్కు నటించడమంటే ఇష్టంలేదని.. ప్రజల అవసరాలను తీర్చడమే ఆయన అభిమతమని ఆయన అన్నారు. తిరునల్వేలిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అధికార డీఎంకే పార్టీపై ప్రముఖ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ధ్వజమెత్తారు. ఇది దురహంకార ఫాసిస్ట్ పాలన.. అంటూ ఆమన మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.
థ్యాంక్స్ సీఎం సార్.. అంటూ 242 మంది విద్యార్థినీ, విద్యార్థులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు కృతజ్ఞతలు తెలిపారు. కశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడిచేసి కాల్చిచంపిన సంగతి తెలిసిందే. అయితే.. జమ్ముకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో వ్యవసాయం, ఉద్యానవన దాని అనుబంధ ఉన్నత విద్యకోసం రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అక్కడికి వెళ్లి చిక్కుకుపోయారు. వారంతా తిరిగి ఇక్కడకు వచ్చారు.
ఉద్యోగులకు ఇదిఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమార్థం ప్రభుత్వం పలు రాయితీలు కల్పించడంతోపాటు, ప్రమాదంలో మరణించినా, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.కోటి అందేలా ఉచిత బీమా పథకానికి శ్రీకారం చుట్టింది.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ఈ నెల 24న ఢిల్లీ వెళుతున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగే నీతి ఆయోగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.