Home » AP High Court
తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సీఐడీ, ఏసీబీ డీజీలను ఆదేశించింది.
తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై సీఐడీ అదనపు నివేదికను కోర్టుకు సమర్పించింది. అదనపు నివేదికను మరో రెండు సెట్లను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్కు సమర్పించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పరకామణి చోరీ కేసుపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసుపై వాదనలు జరిగాయి. అనంతరం ఈ కేసుపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టును నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఆశ్రయించారు.
పరకామణి చోరీ కేసులో జర్నలిస్టు శ్రీనివాసులుకు భద్రత కల్పించాలంటూ తిరుపతి ఎస్పీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను సీఐడీకి అప్పగించాలని ఆదేశించింది.
మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ కోసం బంధువులు వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు మూసివేసింది. ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
మావోయిస్టు అగ్రనేతలను కోర్టులో హాజరుపర్చాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దేవజీ, రాజిరెడ్డి తమ వద్ద లేరని కోర్టుకు పోలీసులు తెలిపారు.
పరకామణి చోరీ కేసుని ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో కేసుపై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. తన వివరాలను సిట్ బృందం అడగటంపై ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు సుబ్బారెడ్డి.