నూజివీడు ఎంపీపీ ఆరేపల్లి శిరీష శనివారం మంత్రి కొలుసు పార్థసారథి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వే అస్తవ్యస్తం కారణంగా ఇప్పటికీ అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భూసర్వే కారణంగా ఇద్దరు నుంచి 10 మంది దాకా రైతులకు జాయింట్ ఎలీపీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్) నంబర్లు ఇచ్చారు.
ఎన్నో ఏళ్ల నుంచి ఇసుక మేటలు, పూడికతో ఉప్పుటేరు ప్రవాహం మందగించింది.
తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రభుత్వం రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేయడంతో ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Yogandra 2025: ఈనెల 21న వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా సీఎం ప్రణాళిక చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామ తెలిపారు. రెండు కోట్ల మంది యోగాకు రిజిస్టర్ అవుతారు అనుకుంటే, రెండు కోట్ల 20 లక్షల మంది రిజిస్టర్ అయ్యారన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 30వ తేదీలోగా దీనిని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగిం చింది.
ముందుగా చెప్పినట్లు పిల్లలందరికీ సొమ్ములు వేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక ఇంట్లో ముగ్గురు ఉన్నా ఒకరికే ఇచ్చేవారు. ఆఖరికి బూట్లు, యూనిఫాం, బ్యాగ్ నాణ్యత లేనివి ఇచ్చేవారు. కొద్దికాలానికే అవి పాడైపోయాయి. ఇప్పుడు మాత్రం లోకేశ్ చొరవతో సక్రమంగా జరుగుతున్నట్లు తెలుస్తోందని ఏలూరుకు చెందిన సాంబశివరావు ఆనందం.
‘నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా..’ అంటూ బాలకృష్ణ తాను నటించిన అఖండ–2 సినిమా డైలాగ్ను పలికి అభిమానులను అలరించారు.
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎంత మందిని చదివిస్తే అంతమంది తల్లులకు తెలుగుదేశం సర్కారు వంద నం వేసింది. తల్లుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసిం ది.