నిరుద్యోగ యువత ఉపాధి మార్గాలకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. నిర్ధేశిత లక్ష్యం ప్రకారం ఉపాధి యూనిట్ల గ్రౌండింగ్ ఈ ఏడాది జరగలేదు.
ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ సదస్సుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
ఆక్వా సాగులో రాయితీలు రావాలన్నా, మరిన్ని ప్రోత్సాహకాలు అందాలన్నా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన అప్సడా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు ఆర్థిక భరోసా కార్యక్రమం కింద చేనేత, పవర్ లూమ్ రంగాలకు చేయూత నిచ్చేందుకు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది.
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతేడాదిజరిగిన నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలజారీ విషయంపై కొత్తకోణం వెలుగుచూసింది..
రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈ నెల 2న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరా రైంది.
పశ్చిమా సియాలో ఏర్పడిన యుద్ధ ఘర్షణల నేపథ్యంలో దేశంలో గ్యాస్, ఇతర ఆయిల్ సరఫరాపై ఏర్పడిన ఒత్తిడితో జిల్లాలో వివిధ కేటరింగ్, చిన్న చిన్న హోటల్స్ నిర్వాహకులు ప్రత్యామ్నాయ వనరులతో కేటరింగ్, టిపిన్ సెంటర్ల నిర్వహణకు సిద్ధమయ్యారు.
జిల్లాలో అమలు చేస్తున్న పీ–4 కార్యక్రమంలో 14,795 బంగారు కుటుంబాలను మార్గదర్శకులతో అనుసంధానం చేయడం వల్ల విద్యా, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు.
రిజిస్ర్టేషన్ శాఖలో స్లాట్ బుకింగ్ విధానానికి రెండు రోజులు వెసులు బాటు కల్పించారు. ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో స్లాట్లు పూర్తయిన తర్వాత కూడా రిజిస్ర్టేషన్లు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
జిల్లాలో ఏలూరు కార్పొరేషన్, మిగిలిన మూడు పురపాలక సంఘాల్లోనూ ఆడిట్ అభ్యంతరాలపై నిర్లక్ష్యం తాండవిస్తోంది. మేము ఎవ్వరికి బాఽధ్యుల కామన్న రీతిలోనే కమిషనర్లు, కిందిస్థాయి అధికారులు వ్యవహ రిస్తున్నారు.