Raghunandan Rao: కేటీఆర్, ఎంపీ సీఎం రమేష్ ఎపిసోడ్పై రఘునందన్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Jul 26 , 2025 | 10:06 PM
తెలంగాణకి రెండు కేంద్రమంత్రి పదవులు ఇస్తే ఓ బీసీకి మంత్రి పదవి ఇచ్చామని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. బీజేపీ 68 మంది సీఎంలను చేస్తే అందులో 21 మంది ఓబీసీలు ఉన్నారని రఘునందన్ స్పష్టం చేశారు.

సంగారెడ్డి: మాజీ మంత్రి కేటీఆర్ (KTR), ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేష్ (MP CM Ramesh) ఎపిసోడ్పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధిష్ఠానంతో చర్చించి ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేటీఆర్ హెచ్సీయూ భూముల విషయంలో బీజేపీ ఎంపీలపై బట్ట కాల్చిమీద వేశారని మండిపడ్డారు. హెచ్సీయూ విషయంలో కేటీఆర్ మొదట కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆ తర్వాత తనపై ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. ఇవాళ(శనివారం) సంగారెడ్డిలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
గత మూడు రోజులుగా ఎక్కడ చూసినా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని రఘునందన్ రావు ధ్వజమెత్తారు. నాలుగున్నర దశాబ్దాల్లో బీజేపీ బీసీలకు ఏం చేసిందో తాను చెబుతానని... మరి బీసీలకు కాంగ్రెస్ ఏం చేసిందో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెబుతారా అని ప్రశ్నించారు. తమ గణాంకాలతో తాను చర్చకు వస్తానని.. ఎక్కడకు రమ్మంటే అక్కడకి వస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గం మళ్లీ ఏర్పాటు చేయాలని సూచించారు. 56 శాతం బీసీలు ఉంటే ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం కరెక్టేనా అని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 250 మందిని కాంగ్రెస్ సీఎంలను చేస్తే అందులో 43 మంది ఓబీసీలు ఉన్నారని గుర్తుచేశారు రఘునందన్ రావు.
బీజేపీ 68 మంది సీఎంలను చేస్తే అందులో 21 మంది ఓబీసీలు ఉన్నారని రఘునందన్ రావు స్పష్టం చేశారు. 31 శాతం ఓబీసీలను బీజేపీ సీఎంలుగా చేసిందని క్లారిటీ ఇచ్చారు. 17 శాతం మందిని మాత్రమే కాంగ్రెస్ సీఎం చేసిందని చెప్పుకొచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్నపుడు కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా ఉన్నారని గుర్తుచేశారు. అలాగే బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్రెడ్డి టీపీసీసీ చీఫ్గా ఉన్నారని తెలిపారు. ఎన్డీఏ కూటమిలో 20 మంది సీఎంలు ఉంటే ఐదుగురు ఓబీసీ, ముగ్గురు ఎస్టీలు, ఇద్దరు మైనార్టీలు సీఎంలుగా ఉన్నారని వెల్లడించారు. మన్మోహన్ సింగ్ కేబినెట్లో కేవలం ఇద్దరు ఓబీసీలు మంత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. మోదీ కేబినెట్లో 21 మంది ఓబీసీలు మంత్రులుగా ఉన్నారని.. దేశానికి రాష్ట్రపతిగా దళితులను, గిరిజనులను చేసిన ఘనత బీజేపీదని ఉద్ఘాటించారు. తెలంగాణకి రెండు కేంద్ర మంత్రి పదవులు ఇస్తే ఓ బీసీకి మంత్రి పదవి ఇచ్చామని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.
ఈవార్తలు కూడా చదవండి..
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
Read latest Telangana News And Telugu News