Minister Vivek Venkataswamy: స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుస్తాం
ABN , Publish Date - Jun 14 , 2025 | 10:07 AM
కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వచ్చే ఎన్నికలనూ దృష్టిలో పెట్టుకొని గ్రామ గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తామని తెలిపారు.

సిద్దిపేట జిల్లా: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెదక్ జిల్లాలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkataswamy) ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ(శనివారం) గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అలాగే సిద్దిపేట రంగదాంపల్లి వద్ద అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ శ్రేణులు మెదక్ జిల్లాలో ఇంతటి ఘనస్వాగతం పలకడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. సన్నబియ్యం, నూతన రేషన్ కార్డుల మంజూరు వంటి కార్యక్రమాలతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అపూర్వ స్పందన వస్తోందని ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికలనూ దృష్టిలో పెట్టుకొని గ్రామ గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని అన్నారు. విభేదాలను పక్కన పెట్టి సమస్యలు పరిష్కారం చేసుకుందామని కోరారు. సిద్దిపేటలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుందాం, వారానికి ఒక్కసారి సిద్దిపేటకి వస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
మరోసారి సిట్ ముందుకు ప్రణీత్ రావు
పుట్టే బిడ్డపై ప్రాణాలు పెట్టుకున్న తండ్రి.. కుమారుడి మృతితో
Read Latest Telangana News And Telugu News