Share News

Harish Rao: మరోసారి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి హరీష్‌రావు

ABN , Publish Date - May 04 , 2025 | 01:20 PM

Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని రక్షించి అండగా నిలిచారు. హరీష్‌రావు చూపిన చొరవతో బీఆర్‌ఎస్ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 Harish Rao: మరోసారి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి హరీష్‌రావు
Harish Rao

సంగారెడ్డి జిల్లా: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు. సదాశివపేట మండలం పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తాపడటంతో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అక్కడ ఉన్న పరిసరాలు భయాంకరంగా మారాయి. ప్రమాదం జరగడంతో క్షతగాత్రులు అర్తనాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌రావు ఈ ప్రమాదాన్ని చూసి ఆగిపోయారు. ఒక్క క్షణం ఆగకుండా వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తన పక్కన ఉన్న సిబ్బందిని, స్థానికులను అప్రమత్తం చేశారు. అప్పటికే గాయపడ్డవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వయంగా తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి, చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి హరీష్‌రావు తరలించారు.


జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని హరీష్‌రావు సూచించారు. హరీష్‌రావు చూపిన చొరవతో బీఆర్ఎస్ నేతలు, ప్రజలు ప్రశంసించారు. తనకు రాజకీయ ప్రయోజనాల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమనేలా హరీష్‌రావు చర్యలు చేపట్టారని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: ప్రమాద బాధిత కుటుంబానికి కేటీఆర్‌ అండ

Ponnam Prabhakar: ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు పిలిచే చాన్స్‌

Ration Misuse: బియ్యం అమ్ముకుంటే రేషన్‌ కార్డు రద్దు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 04 , 2025 | 01:50 PM