Home » Medak
నంగునూరు మండల కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల నియామకం పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపింది.
పాత కక్షల కారణంగా నిండు ప్రాణం బలైంది. ఇంటి పక్కన ఉండే కుటుంబంపై కక్షతో ఒక వ్యక్తి పన్నని కుట్రకు, ఎలాంటి సంబంధం లేని మరో అమాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. మెదక్ జిల్లా నార్సింగిలో చోటు చేసుకున్న ఈ విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని గంటల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో భారీ ప్రాణ నష్టం సంభవించింది. మెదక్, వరంగల్, భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వివరాల్లోకి వెళితే..
మెదక్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. ఒక వైపు కన్నతండ్రి భౌతికకాయం ఇంట్లో ఉండగానే.. మరోవైపు తన భవిష్యత్తు కోసం ఆ విద్యార్థి కన్నీటి పర్యంతమవుతూ పదోతరగతి పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు, ఉపాధ్యాయులు కంటతడి పెట్టారు.
మెదక్ జిల్లా ఏడుపాయల శివారలో జరిగిన మహిళ హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. అనుమానం పెను భూతమైంది.. వేరే వ్యక్తితో మాట్లాడుతోందన్న అనుమానంతో ప్రియుడు కర్రతో అతి దారుణంగా కొట్టి చంపినట్లు మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ వెల్లడించారు.
జహీరాబాద్ ప్రాంతంలో సహజసంపదను కొల్లగొట్టేందుకు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఎర్రరాయి, మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకునే క్రమంలో ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు.
మద్యానికి డబ్బులు లేకపోవడంతో కన్నబిడ్డనే విక్రయించింది కసాయి తల్లి. మెదక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ధర పాతాళానికి పడిపోవడంతో ఉల్లి రైతు కన్నీరు పెడుతున్నాడు.
పారిశ్రామిక ప్రాంతాలు కాజీపల్లి, గడ్డపోతారం పరిధిలో చిరుత సంచారం స్థానికంగా భయాందోళనలు కలిగిస్తుండగా.. గురువారం దూడ పై దాడి చేసి చంపివేసిన ఘటన కార్మిక వర్గలు, స్థానిక గ్రామాలలో కలకలం రేపింది.