Share News

Minister Ponguleti: తెలంగాణ అప్పులకు కారణమిదే.. మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్

ABN , Publish Date - May 06 , 2025 | 02:38 PM

Minister Ponguleti Srinivasa Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు కేసీఆర్ ఘన కార్యమేనని, తమ ప్రభుత్వ ఖాతాలో వేసుకోమని తేల్చిచెప్పారు. తెరిచిన పుస్తకం ఇందిరమ్మ ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు.

Minister Ponguleti: తెలంగాణ అప్పులకు కారణమిదే.. మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్
Minister Ponguleti Srinivasa Reddy

ఖమ్మం జిల్లా: కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో భారీగా అవినీతికి పాల్పడిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం రూ. 8 నుంచి రూ.19 వేల కోట్లకు పైగా అప్పు చేసిందని ఆరోపణలు చేశారు. వడ్డీకి అప్పు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రం మీద కేసీఆర్ గుదిబండ పెట్టిందని ఆరోపించారు. ఆ అప్పులు తీర్చుకుంటూ తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఉద్ఘాటించారు. నిజాన్ని తప్పుగా మార్చుతూ ప్రజలను బీఆర్ఎస్ నేతలు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద మహా వృక్షం.. ఆ మహా వృక్షం కింద ఎన్ని కోట్ల మంది అయినా సేద తీర్చుకోవచ్చని చెప్పారు. ఇవాళ(మంగళవారం) కూసుమంచిలో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఎత్తు పల్లాలు సహజమని అన్నారు. బ్యాంకులను జాతీయం చేసి పేదవారికి ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ పంచి ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తుచేశారు.


ప్రాంతీయ పార్టీలు తారాజువల్ల ఎగిరి కిందపడతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో పనిచేస్తున్నామని తాము గర్వంగా చెప్పుకుంటామని అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు జాతీయ, రాష్ట్ర నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కృషి ఎంతో ఉందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ కలిసే ఉంటారని అన్నారు. ఉద్యోగ సంఘాలను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు.


మాయమాటలు చెప్పడం ఇందిరమ్మ ప్రభుత్వానికి రాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అప్పు ఉందని చెప్పకపోతే ప్రజలను మోసం చేసినట్లు అవుతుందని చెప్పారు. ఎనిమిదో వింత కాళేశ్వరం అని విమర్శలు చేశారు. ఆ ప్రాజెక్ట్ మూడేళ్లలోనే నెర్రులు వచ్చిందని అన్నారు. అబద్ధాలను నిజాలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు తాపత్రయ పడుతున్నారని అన్నారు. వరంగల్ సభను ఆపడానికి ఇందిరమ్మ ప్రభుత్వం చూసిందని బీఆర్ఎస్ నాయకులు అబద్దాలు చెబుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు.


తాము ఆ సభను అపాలంటే బస్సులు ఎందుకు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఖమ్మంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభను బీఆర్ఎస్ నేతలు గతంలో అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చిన ఎదుర్కోవడానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు కేసీఆర్ ఘన కార్యమేనని, తమ ప్రభుత్వ ఖాతాలో వేసుకోమని తేల్చిచెప్పారు. తెరిచిన పుస్తకం ఇందిరమ్మ ప్రభుత్వమని ఉద్ఘాటించారు. పేదవారి బాగోగుల కోసం ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అమలు చేశామని గుర్తుచేశారు. 25 లక్షల 60 వేల మంది రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తున్నామని ప్రకటించారు. పదేళ్లలో కేసీఆర్ చేయలేనివి.. 16 నెలల్లో తాము చేసి చూపించామని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో భూ భారతి చట్టం తీసుకువచ్చి రైతులకు అండగా ఉన్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

TDP: టీడీపీలో విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

GV Babu: అనారోగ్యంతో బలగం నటుడు.. సహాయం కోసం ఎదురు చూపు..

Helicopter Ride: సరస్వతి పుష్కరాల్లో ‘జాయ్‌ రైడ్‌’

NEET: మార్కులు తగ్గినా.. సీటు గ్యారంటీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2025 | 02:56 PM