Minister Ponnam Prabhakar: కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పిలుపు
ABN , Publish Date - May 21 , 2025 | 08:45 PM
Minister Ponnam Prabhakar: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

సిద్దిపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలవాలని.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ (Congress) శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) దిశానిర్దేశం చేశారు. ఇవాళ(బుధవారం) సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. బ్లాక్, వార్డు అధ్యక్షుల దరఖాస్తులను పీసీసీ పరిశీలకులు పవన్ మల్లాది స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం, సన్నవడ్లకు బోనస్, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యకర్తలు, నేతల అందరి ఆశీర్వాదంతో తాను మంత్రిని అయ్యానని.. సిద్దిపేట జిల్లాలో చాలా కార్యక్రమాలు చేస్తున్నానని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డులకు గానూ 20 స్థానాలు గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అభివృద్ధి , ఉమ్మాపూర్ వద్ద ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో హుస్నాబాద్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలని కోరుకున్నారు. మహా సముద్రం ప్రాంతం టూరిజం ప్రాజెక్ట్గా అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు. హుస్నాబాద్ టౌన్ నుంచి రాజీవ్ రహదారికి ఫోర్ లైన్ రోడ్డు పనులు జరుగుతాయని తెలిపారు. హుస్నాబాద్లో 150 పడకల ఆస్పత్రికి స్థలం చూశామని అన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి గౌరవెల్లి ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన కాలువలను తవ్వడానికి భూసేకరణ వేగవంతంగా జరుగుతుందని అన్నారు. హుస్నాబాద్ పక్కన చౌటపల్లిలో పారిశ్రామిక కారిడార్ తీసుకువస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం
CM Revanth Reddy: పాక్కి బుద్ది చెప్పడంలో ప్రధాని వెనకడుగు..
Miss World contestants: రొమ్ము క్యాన్సర్ అవగాహనలో మిస్ వరల్డ్ బ్యూటీస్ తోడ్పాటు
Heavy Rain: హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Read latest Telangana News And Telugu News