Home » Telangana » Karimnagar
కాంగ్రెస్ జిల్లా సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం రసాభాసగా మారింది.
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్య క్రమంలో అదనపు కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
కర్రె గుట్ట ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ను ఆపాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు నిర్వహించాలని సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వ ర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దులో గల కర్రెగుట్ట యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం వేసవి శిక్షణ తరగతు లను నిర్వహిస్తున్నామని, వాటి ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొ న్నారు. సోమవారం కలెక్టరే ట్లో ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో జిల్లాలోని అన్ని గ్రామాలలో 1నుంచి 7వ తరగతి చదివే విద్యార్థులకు మే1 నుంచి జూన్ 10 వరకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నామ న్నారు.
ఉగ్రవా దానికి వ్యతిరేకంగా పోరాడాలని బీజేపీ సీనియర్ నాయ కులు పల్లె సదానందం పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తున్నామన్నారు.
కరీంనగర్ రైల్వే స్టేషన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ రమేష్రెడ్డి తెలిపారు. కరీంనగర్ రైల్వే స్టేషన్లో జరుగున్న అభివృద్ది పనులను ఆయన శనివారం సందర్శించారు.
రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, బ్యాంకర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన భూభారతి ఆర్వోఆర్ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ సత్పతి పమేలా అన్నారు. సోమవారం వీణవంక మండలం చల్లూరు రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
పార్టీ నిర్దేశించిన క్రమశిక్షణ లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ కాంగెరస్ శ్రేణులను హెచ్చరించారు. కాంగ్రెస్ జిల్లా సంస్థాగత నిర్మాణం సన్నాహక సమావేశం సోమవారం డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విశ్వనాథన్ పెరుమాళ్ మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణ విధానాన్ని కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరూ పాటించాలన్నారు.
జగిత్యాల, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ఇంకుడు గుంతలను నిర్మించి ప్రతి నీటి బొట్టును ఒడిసి పడితేనే వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చేయవచ్చు. భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు, వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంటింటా ఇంకుడు గుంతలు తవ్వించాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.