Home » Telangana » Karimnagar
ఏపీ మంత్రి నారా లోకేష్ బనకచర్ల ప్రాజెక్టు కడతామని అన్నారని.. ఈ ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకచర్లను సీడబ్ల్యూసీ తిరస్కరించిందని గుర్తుచేశారు. బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని ఢిల్లీలో జరిగిన సమావేశంలో తాము చెప్పామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం జిల్లాలో నిర్వహించనున్నారు. రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదివారం జిల్లాకు రానున్నారు.
గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువ చేయాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ (పీఎం ఉష) పథకంతో జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ అటానమస్ కళాశాలకు మహర్దశ పట్టుకుంది. డిగ్రీ కళాశాల స్థాయి ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడం, విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం, విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం ఉష పథకాన్ని అమలు చేస్తున్నది.
పెద్దపల్లి జిల్లా ఏర్పాటై ఎనమిదిన్నరేళ్లు గడుస్తున్నా కూడా కేంద్రీయ నవోదయ విద్యాలయానికి నోచుకోలేదు. గతంలో ఉన్న విద్యాలయాలకు తోడు కేంద్రం ప్రభుత్వం రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు కొత్తగా నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది.
పెళ్లి వేడుక ప్రతి కుటుంబంలో అతి ముఖ్యమైన సంబరం. పెళ్లంటే నూరేళ్ల పంటగా భావిస్తారు. కల్యాణం కమనీయంగా ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ పెళ్లి తంతు కోసం దూరతీరాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు తరలివస్తారు. ఈనెల నుంచి పెళ్లి ముహూర్తాలు ఎన్నో ఉన్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఆయిల్పామ్ పంటల సాగుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ఝా అదేశించారు.
వేములవాడ పట్టణం లో 2వేల మందికి పైగా ఇళ్లు లేవని లెక్కలు చెబుతున్నాయని, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దృష్టికి తీసుకువెళుతాన ని, అందరికి ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
మహిళలకు ప్రత్యేక చట్టాలున్నా యని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాధి క జైశ్వాల్ అన్నారు.
రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు స్పష్టం చేశారు. మంథని మున్సి పాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళలు వ్యాపార రంగంలో అభివృద్ధి చెంద టానికి స్పెషల్ ఇండస్ట్రి యల్ పార్కును మం థని శివారులో ఏర్పాటుకు కృషి చేస్తున్నామ న్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీల ఎంపీలను కలుపుకుని ఉద్యమించామని, అప్పుడు తనకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం వచ్చినా తెలంగాణ కోసం వదులుకున్నానని రాష్ట్ర గను లు, భూగర్భ, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం రాత్రి పెద్దప ల్లిలో నిర్వహించిన ఆత్మీయ పౌర సన్మానంలో పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.