Home » Telangana » Karimnagar
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో తమ దశ మారుతుందని ఆశపడ్డ కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు పూర్తిగా నిరాశ, నిస్పృహల్లో పడిపోయాయి. ఎన్నికలకు ముందుగాని మళ్లీ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం లేనందువల్ల ఈ నియోజకవర్గం పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదనే భావనతో డీలా పడుతున్నారు.
రాజన్న ఆలయ గోశాలలోని కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధానత్యను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ఝా అన్నారు.
యాదవులు అన్ని రంగాల్లో తమ హక్కుల కోసం ఉద్యమించాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్యాదవ్ అన్నారు.
కార్పొరేట్, ప్రైవేటు పాఠ శాలలో ఫీజులు నియంత్రణపై నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ అన్నారు.
మండలానికి ఒక క్రీడా మైదా నం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఎకరాకు 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడిచినా కౌలు రైతుల ఆశలు నెరవేరడం లేదు.
పల్లె పోరుకు ప్రభుత్వం మళ్లీ సన్నాహాలు మొదలుపెట్టింది. వచ్చే నెలలో ఎన్నికలు ఉంటాయని సంకేతాలు ఇవ్వడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామపంచాయతీలో పొలిటికల్ సందడి మొదలైంది. 15న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేటప్పుడు, ఏ కులం, ఏ మతం అని చూడలేదు.. పేదోడైతే చాలనుకున్నాం.. ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరతామని, చివరకు పింకు షర్టు తొడుక్కున్న వాళ్లకు కూడా ఇళ్లు ఇస్తామని, తల తాకట్టు పెట్టయినా పేదలకు ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ప్రజా సమస్యలపై ప్రత్యేకదృష్టి సారించాలని ఎస్పీ అశోక్కుమార్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం సారంగాపూర్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేపట్టారు.
దేశాన్ని కాపాడేది సైనికులైతే సమాజాన్ని కాపాడేది కమ్యూనిస్టులేనని.. దేశంలో ఎర్ర జెండా లేకుండా చేయడం ప్రధాని మోదీ కాదని సీపీఐ శాసనసభ పక్షనేత కూనంనేని సాంబశివరావు అన్నారు.