Share News

Telangana Cabinet Meeting: జూన్ 5న కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

ABN , Publish Date - Jun 01 , 2025 | 09:28 PM

తెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 5వ తేదీన నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఇవాళ ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు.

 Telangana Cabinet Meeting: జూన్ 5న కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
Telangana Cabinet Meeting

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం (Telangana Cabinet Meeting) జూన్ 5వ తేదీన నిర్వహించి.. కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఇవాళ (ఆదివారం) ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సమావేశమయ్యారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వాన కాలం పంటల సాగు సన్నద్ధత, రాజీవ్ యువవికాసం అంశాలపై మంత్రులు అందించిన నివేదికపై ఈ సమావేశంలో చర్చించారు. మే 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ నాలుగు అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు.


తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితాలు, రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలపై ఈ సమావేశంలో వివరించారు. రాజీవ్ యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, అనర్హులకు యువవికాసం అందకుండా చూడాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.


మరింత లోతుగా విశ్లేషించి లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. ఒక్క అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దని తెలిపారు. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి సంబంధించి అధికారులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఇప్పటికే నివేదిక అందజేశారు. ఆ నివేదికపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులకు వివరించారు. ఈ విషయంపై కేబినెట్‌లో చర్చించి సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులు అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వేములవాడలో కొనసాగుతోన్న కోడెల మృత్యు ఘోష.. స్పందించిన కలెక్టర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

For Telangana News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 09:34 PM