Minister Uttam: పాకిస్థాన్తో కాల్పుల విరమణపై ట్రంప్ ఎలా ట్వీట్ చేశారు.. ప్రధాని మోదీపై మంత్రి ఉత్తమ్ ప్రశ్నల వర్షం
ABN , Publish Date - May 31 , 2025 | 03:26 PM
కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ట్వీట్ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఫైటర్ విమానాలు, ఆయుధాల సప్లయి ఆలస్యం అవుతున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ఆందోళన కలిగిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ఢిల్లీ: చైనా , పాకిస్థాన్తో ముప్పు నేపథ్యంలో భారత్ భద్రతను పటిష్టం చేయాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) కోరారు. ఆపరేషన్ సిందూర్లో భారత ఎయిర్ఫోర్స్ విజయాలపై తాము గర్విస్తున్నామని కొనియాడారు. మన సైనికులు అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించారని, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారని ప్రశంసించారు. ఇవాళ(శనివారం) ఢిల్లీ వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. యుద్ధంలో రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయాయా.. అనే ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ మంత్రి సరైన సమాధానం చెప్పలేదని అన్నారు. ఆపరేషన్లో రాఫెల్ యుద్ధ విమానం కూలిపోయిందని సీడీఎస్ అనిల్ చౌహన్ మాత్రం స్పష్టం చేశారని తెలిపారు. భారత ప్రభుత్వం ఇకనైనా దీన్ని నిరాకరించడం మానుకోవాలని.. ఇదే విషయాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ మొదటి నుంచి అడుగుతున్నారని గుర్తుచేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ట్వీట్ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఫైటర్ విమానాలు, ఆయుధాలను అందించడంలో ఆలస్యం అవుతుందని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. బూమ్బర్గ్ ఛానెల్లో భారత సీడీఎస్ ఈ విషయాన్ని వెల్లడించారని గుర్తుచేశారు. 42 ఫైటర్ విమానాలు మంజూరైతే... మన వద్ద కేవలం 31 యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు. తేలికపాటి యుద్ధ విమానాలను సప్లై చేయడంలో హెచ్ఏఎల్ ఆలస్యం చేస్తోందని.. అత్యవసరంగా ఈ సమస్యను పరిష్కరించాలని అన్నా రు. ఆపరేషన్, ఆర్ అండ్డీ విభాగాల్లోకి బెస్ట్ బ్రెయిన్స్ రావడం లేదని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకత పాటించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు
NIA raids: వరంగల్లో ఉగ్ర కలకలం!
Read Latest Telangana News and National News