KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవ్వడంపై కేసీఆర్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Jun 02 , 2025 | 02:51 PM
కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 5వ తేదీన విచారణకు హాజరుకావాలని కాళేశ్వరం కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది.

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణకు (Kaleshwaram Commission Enquiry) మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR) దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 5వ తేదీన విచారణకు రావాలని కాళేశ్వరం కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఈ విచారణకు మరింత సమయం కావాలని కమిషన్ ఛైర్మన్ను కేసీఆర్ కోరినట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకావడంపై ఆయన సుదీర్ఘ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ(జూన్ 2) తెలంగాణ భవన్లో మాజీమంత్రి హరీష్రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని భావించారు. కానీ అనివార్య కారణాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 9వ తేదీన కమిషన్ ఎదుట విచారణకు మాజీమంత్రి హరీష్రావు హాజరుకానున్నారు. హరీష్రావు హాజరు తర్వాత పరిణామాలను బేరీజు వేసుకుని ఈనెల 11న విచారణకు వెళ్లాలా, వద్దా? అనే విషయంపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
జీహెచ్ఎంసీ అత్యవసర బృందాల.. టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయాలి
Read Latest Telangana News And Telugu News