KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు బయల్దేరిన కేసీఆర్
ABN , Publish Date - Jun 11 , 2025 | 10:11 AM
కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. విజిటర్స్, పలు పనులపై బీఆర్కే భవన్కి వచ్చే వారిని గేట్ బయటే పోలీసులు నిలిపివేస్తున్నారు. బీఆర్కే భవన్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే లోపలకు పోలీసులు అనుమతిస్తున్నారు.

హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR) కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణకు బయలు దేరారు. సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్హౌస్ నుంచి హైదరాబాద్కి కేసీఆర్ రానున్నారు. ఇవాళ(బుధవారం) ఉదయం 11:30లకు కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరుకానున్నారు. గులాబీ బాస్ వెంట ఓపెన్ కోర్టుకు తొమ్మిది మంది బీఆర్ఎస్ నేతలకు అనుమతి ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ప్రశాంత్రెడ్డి, పద్మారావుగౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి మాత్రమే కమిషన్ అనుమతించింది. బీఆర్కే భవన్ వద్దకు భారీగా పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు.
పోలీసుల ఆంక్షలు..
కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యే నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. విజిటర్స్, పలు పనులపై బీఆర్కే భవన్కి వచ్చే వారిని గేట్ బయటే పోలీసులు నిలిపివేస్తున్నారు. బీఆర్కే భవన్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే లోపలకు పోలీసులు అనుమతిస్తున్నారు. బీఆర్కే భవన్, జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు రోడ్డుని మూసివేశారు. ఇదిలా ఉండగా.. కేసీఆర్ ఫాంహౌస్ వద్దకు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇక్కడికి ఎవరూ రావద్దని పార్టీ హై కమాండ్ ఆదేశించినప్పటికీ కేసీఆర్తో కదిలేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
For More Telangana News and Telugu News..