Share News

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలు..హైదరాబాద్‌లో భారీ భద్రత

ABN , Publish Date - May 08 , 2025 | 03:43 PM

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సైబరాబాద్ జాయింట్ సీపీ గజారావ్ భూపాల్ తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.

 Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలు..హైదరాబాద్‌లో భారీ భద్రత
Miss World 2025

హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ పోటీలు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో వందకు పైగా దేశాల నుంచి అతిథులు, ప్రపంచ మోడల్స్, పలు పరిశ్రమలకు చెందిన సినీనటలు కూడా భాగ్యనగరానికి రానున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా సైబరాబాద్ జాయింట్ సీపీ గజారావ్ భూపాల్ హైదరాబాద్‌లో అతిథుల భద్రతకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఇవాళ(గురువారం) గజారావ్ భూపాల్ మాట్లాడారు. మిస్ వరల్డ్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సైబరాబాద్ జాయింట్ సీపీ గజారావ్ భూపాల్ తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈవెంట్ కొనసాగుతుందని అన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఇప్పటికే 80శాతానికి పైగా అతిథులు, పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారని సైబరాబాద్ జాయింట్ సీపీ గజారావ్ భూపాల్ వెల్లడించారు.


వారికి కేటాయించిన హోటల్స్ వద్ద కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని సైబరాబాద్ జాయింట్ సీపీ గజారావ్ భూపాల్ చెప్పారు. అతిథులు స్టే చేసే పరిసరాలను రెడ్ జోన్, గ్రీన్ జోన్‌గా పెట్టామని చెప్పారు. అనుమతి లేకుండా ఎవరికి లోపలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో చాలా ప్రదేశాలను అతిథులు సందర్శిస్తారని తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల కోసం ఎలాంటి ట్రాఫిక్ డైవర్షన్‌లు ఉండవని అన్నారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిని తీసుకెళ్తామని చెప్పారు. సీఎం , గవర్నర్, మంత్రులు, వీవీఐపీ, వీఐపీలకు ప్రోటోకాల్ ఉంటుందని తెలిపారు. ఇతర జిల్లాల నుంచి కూడా ఫోర్స్‌ను తెప్పించామని అన్నారు. 31వ తేదీన మిస్ వరల్డ్ ఫైనల్ ఉండబోతుందని.. దానికి అనుగుణంగా భద్రత పరమైన చర్యలు తీసుకుంటున్నామని సీపీ గజారావ్ భూపాల్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Operation Sindoor: జమ్మూకాశ్మీర్‌లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి

Operation Sindoor: రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్‌.. సిద్ధమైన క్షిపణులు..

Iran FM Seyed Araghchi: ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి

Pakistan: లాహోర్‌లో పేలుళ్లు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..

Read Latest International News And Telugu News

Updated Date - May 08 , 2025 | 03:43 PM