Home » Hyderabad City Police
శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు నిఘా వర్గాల అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో తాజాగా ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఇప్పటివరకు అరెస్టైన నిందితుల సంఖ్య 11కు చేరింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు మహిళలే ఏజెంట్లుగా ఉన్నారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారులు సినీ నటుడు ప్రకాష్రాజ్కు నోటీసులు ఇవ్వడంతో బుధవారం విచారణకు హాజరయ్యారు. ప్రకాష్రాజ్ను మూడు గంటలుగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దుబాయ్కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
కొంచెం తక్కువ ధరకు వస్తుందని చాలామంది సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొంటుంటారు. అయితే, సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనేటప్పుడు ప్రజలు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను సూచిస్తూ తెలంగాణ పోలీసులు ఎక్స్ వేదికగా హెచ్చరిక జారీ చేశారు.
బెట్టింగ్ యాప్స్ కేస్లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సినీ సెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నటుడు ప్రకాష్రాజ్కి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈడీ అధికారుల నోటీసుల మేరకు ప్రకాష్రాజ్ బుధవారం విచారణకు హాజరు కానున్నారు.
యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అక్రమ సరోగసీ, పిల్లల అమ్మకపు రాకెట్ను ఛేదించామని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు ఆదివారం డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు.
మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై స్పందించారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ మేరకు జూబ్లీహిల్స్ సీఐ ఆదివారం మీడియాతో మాట్లాడారు. అన్ని కేసుల్లో హైదరాబాద్ సిటీ పోలీసులు దర్యాప్తు పారదర్శకంగా జరుపుతున్నారని స్పష్టం చేశారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని జూబ్లీహిల్స్ సీఐ పేర్కొన్నారు.
సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయడంతోనే పలువురు ఆకర్షితులు అయ్యారని ఈడీ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టి అమాయకులు మోసపోయినట్లు అధికారులకి ఫిర్యాదులు అందాయి.
లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఇవాళ ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో ఓ యువకుడిపై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడికి బలమైన గాయాలయ్యాయి. హైదరాబాద్లో చదువుకునేందుకు సోమాలియా నుంచి వచ్చిన యువకుడిపై దుండగులు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.