Home » Hyderabad City Police
మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేక విచారణ బృందం ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండగా, ఈ కేసులో రోహిత్ రెడ్డి, డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ పాత్రపై కీలక ఆధారాలు లభించాయి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ మోసం వెలుగుచూసింది. నిజాంపేట పరిధిలో ఫ్లాట్ల విక్రయం పేరిట జరిగిన ఈ కోట్లాది రూపాయల కుంభకోణంపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా అధికారులు ఒక పెను ప్రమాదాన్ని అడ్డుకున్నారు. శంషాబాద్ నుంచి కేరళం వెళ్లేందుకు సిద్ధమైన ఒక ప్రయాణికుడి బ్యాగేజీలో బుల్లెట్లు బయటపడటంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
క్యూనెట్ సంస్థ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట ఘరానా మోసం చేస్తోందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మోసాలు చేస్తున్న క్యూనెట్ సంస్థపై దాడులు చేసి 32 మంది నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాదకర ఘటన నగరంలోని పాత అపార్ట్మెంట్ల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.
హైదరాబాద్లోని ఐటీ కారిడార్ మాదాపూర్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. మార్చి 19న పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల్లో భారీగా హ్యాష్ ఆయిల్ పట్టుబడింది.
రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం (జుమాతుల్ విదా) ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పలు ఆంక్షలు విధించారు. ఈ ట్రాఫిక్ రూల్స్ని వాహనదారులు గమనించాలని జాయింట్ కమిషనర్ సూచించారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఆగంతకుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఈ నెల 27వ తేదీలోగా ఆయనను చంపేస్తామని ఆగంతకులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ సమీపంలో దారుణ ఘటన జరిగింది. అక్క ప్రవర్తన సరిగా లేదనే కారణంతో తమ్ముడు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అమానుషంగా ఆమెను హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
హైదరాబాద్ ఫలక్నుమా ఫరూఖ్నగర్లో బస్డిపో సమీపంలోని సోఫాల తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి నుంచి మంటలు పక్కనే ఉన్న ఫర్నిచర్ షాపు, ఇతర దుకాణాలకు వ్యాపించాయి.