Share News

Bandi Sanjay: ఆపరేషన్ సిందూర్.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు తెలుగు విద్యార్థుల లేఖ

ABN , Publish Date - May 10 , 2025 | 12:07 PM

Bandi Sanjay: పాకిస్తాన్, భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జమ్మూ కశ్మీర్‌‌లో చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌కు తెలుగు విద్యార్థులు లేఖ రాశారు. దీంతో వెంటనే కేంద్రమంత్రి బండి సంజయ్‌ రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.

Bandi Sanjay: ఆపరేషన్ సిందూర్.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు తెలుగు విద్యార్థుల లేఖ
Bandi Sanjay

హైదరాబాద్: యుద్ద ప్రాంతంలో చిక్కుకుపోయామని.. తమను ఆదుకోవాలని, కశ్మీర్ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌‌కు (Bandi Sanjay Kumar) SKUAST యూనివర్సిటీకి చెందిన ఏపీ, తెలంగాణ విద్యార్థులు ఇవాళ(శనివారం) లేఖ రాశారు.వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పందించారు. జిల్లా కలెక్టర్, వర్సిటీ డీన్‌తో బండి సంజయ్ మాట్లాడారు. తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించాలని బండి సంజయ్ కోరారు. ఏపీ, తెలంగాణకు చెందిన 23 మంది విద్యార్థులను జమ్మూకశ్మీర్ యంత్రాంగం తరలిస్తున్నారు.


కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో జమ్మూ కశ్మీర్ లోని యుద్ద ప్రాంతంలో చిక్కుకుపోయి ఆందోళనకు గురవుతున్న తెలుగు విద్యార్థులను జమ్మకశ్మీర్ అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమైంది. తెలంగాణ, ఏపీకి చెందిన మొత్తం 23 మంది విద్యార్థులు కశ్మీర్ యుద్ద ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జమ్మూ కశ్మీర్ లోని షేర్-ఇ-కాశ్మీరీ వ్యవసాయ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(SKUAST)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 మంది తెలుగు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గత కొద్దిరోజులుగా పాకిస్తాన్ డ్రోన్ల సాయంతో, క్షిపణులతో కశ్మీర్‌లోని ప్రజలు నివసిస్తున్న ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్మీ శిబిరాలపై దాడి చేస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలంతా తీవ్రమైన భయాందోళనల్లో ఉన్నారు. ఎప్పుడు ఏమవుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీనికితోడు అక్కడి ఎయిర్ పోర్టులు మూసివేయడంతో అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ దుస్థితిని వివరిస్తూ 23 మంది తెలుగు విద్యార్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు లేఖ రాశారు.


పరిస్థితి భయానకంగా ఉంది.. సాయం చేయండి...

‘మేము యుద్ధ ప్రాంతంలో చిక్కుకుని ఉన్నాం. మేం చదువుకునే విశ్వవిద్యాలయాల్లోనే ఉన్నప్పటికీ ఇక్కడి పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. పరిస్థితి భయానకంగా ఉంది. విమాన సేవలు నిలిపివేయడంతో మేము జమ్మూ కశ్మీర్ నుంచి బయటకు వెళ్లలేకపోతున్నాం. ఈ ప్రమాదకర ప్రాంతం నుంచి మమ్మల్ని తక్షణమే తరలించి ఆదుకోండి’ అని విద్యార్థులు అభ్యర్ధించారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత జిల్లా కలెక్టర్, SKUAST వర్శిటీ డీన్‌లతో మాట్లాడి తెలుగు విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచనతో జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం 23 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టింది.


విద్యార్థుల వివరాలు ఇవే...

  • కోత వెంకట్ కశ్యప్ - తెలంగాణ

  • రవి వేముల - తెలంగాణ

  • రాజశేఖర్‌రావు - తెలంగాణ

  • పల్లె భరత్ కుమార్ - తెలంగాణ

  • భూక్య అరుణ్ పాండా - తెలంగాణ

  • భూక్య మమత - తెలంగాణ

  • వసంత్ కుమార్ - తమిళనాడు

  • రాజన్ ధనపాల్ - తమిళనాడు

  • వి. మోహన్ రాజ్ - తమిళనాడు

  • గోకుల్ రాజ్. బి - తమిళనాడు

  • అంసరాజ్. ఎం - తమిళనాడు

  • మణికందన్ - తమిళనాడు

  • పవిత్ర ఏఎస్ - తమిళనాడు

  • ప్రియ .వి - తమిళనాడు

  • కయల్ వీజీ - తమిళనాడు

  • డి. వనతి - తమిళనాడు

  • ఎం. రవీంద్ర నాయిక్ - ఆంధ్రప్రదేశ్

  • బి. శివేశ్వరరావు - ఆంధ్రప్రదేశ్

  • షేక్. ఆసిఫ్ బాషా - ఆంధ్రప్రదేశ్

  • మోనికా - ఆంధ్రప్రదేశ్

  • ఎన్. హరిక శ్రీ - ఆంధ్రప్రదేశ్

  • బుస్స లక్ష్మి కళ్యాణి - ఆంధ్రప్రదేశ్

  • మహేశ్వరి . బి - ఆంధ్రప్రదేశ్

    మొత్తం విద్యార్థులు: 23 మంది


ఈ వార్తలు కూడా చదవండి

Operation Sindoor: మావోల వేటకు విరామం.. బార్డర్‌‌కు బలగాలు

Harish Support To Soldiers: ఓపికకు హద్దు ఉంటుంది.. ఇక సహించం

Young Doctor Drug Case: డీజేతో పరిచయం... కొకైన్‌కు బానిస.. యువవైద్యురాలి కథ ఇదీ

Bhatti Vikramarka: యుద్ధ వాతావరణం.. సమగ్ర ప్రణాళిక అవసరం

Updated Date - May 10 , 2025 | 12:27 PM