Operation Sindoor: పాకిస్తాన్పై ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలి: అసదుద్దీన్
ABN , Publish Date - May 07 , 2025 | 09:23 AM
Asaduddin Owaisi: ఆపరేషన్ సింధూర్కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలిపారు. పాకిస్థాన్లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత రక్షణ బలగాలు లక్ష్యంగా చేసుకున్న దాడులను తాను స్వాగతిస్తున్నానని అన్నారు.

హైదరాబాద్: పాకిస్తాన్పై భారత బలగాలు దాడులు చేశాయి. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరిట పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ అధికారులు దాడులు జరిపారు. ఆపరేషన్ సింధూర్ను పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కూడా ఆపరేషన్ సింధూర్కు సపోర్టు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆపరేషన్ సింధూర్కు అభినందనలు తెలిపారు.
పాకిస్థాన్లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత రక్షణ బలగాలు చేసిన దాడులను తాను స్వాగతిస్తున్నానని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలని తెలిపారు. జై హింద్.. ఆపరేషన్ సింధూర్ అని అసదుద్దీన్ ఒవైసీ పూర్తి మద్దతు పలికారు.
కాగా.. భారత పర్యాటకులపై ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్కు చెందిన ఉగ్రమూకలు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 26 మంది భారత పర్యాటకులు చనిపోయారు. ఈదాడులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాయి. ఈ క్రమంలో భారతదేశానికి పలు దేశాలు మద్దతు ఇచ్చాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులు తమపై చేసిన దాడులకు గట్టిగా సమాధానం చెబుతామని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశాన్ని తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడులు చేశాయి. ఈదాడుల్లో 50కు పైగా ఉగ్రవాదులు మృతిచెందగా... పలువురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
India Pak War: పాకిస్తాన్పై మెరుపుదాడి, 30 మంది ఉగ్రవాదులు హతం..
Read Latest Telangana News And Telugu News