Home » Asaduddin Owaisi
పాకిస్థాన్ చేస్తున్న ఉగ్రవాద దురాగతాలకి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పాక్ చేస్తున్న దుర్మార్గపు చర్యల్ని రియాద్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు కళ్లకు కట్టినట్టు చప్పే ప్రయత్నం చేశారు అసద్.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తెలివి తక్కువ జోకర్లు అని వ్యాఖ్యానించారు. ఈ జోకర్లు భారత్తో పోటీ పడాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
Asaduddin Owaisi Slams Pakistan: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒక ఫొటోను బహూకరించారు. ఆ చిత్రం ఇటీవల భారతదేశంపై పాకిస్థాన్ జరిపిన దాడికి సంబంధించినదని పేర్కొన్నారు. కానీ ఆ ఫోటో 2019 కి సంబంధించినది. దీంతో దాయాది దేశానికి తనదైన స్టైల్లో మరోమారు చురకలంటించారు AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.
పాక్ ఆట కట్టించడంతోపాటు కశ్మీరీలను అక్కున చేర్చుకోవాలని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్రానికి సలహా ఇచ్చారు. పాక్ అంతు చూసేందుకు భారత్కు ఇదే సరైన తరుణమని ఒవైసీ చెప్పారు.
భారత్తో ఉన్న చారిత్రక సంబంధాలను తుర్కియే మర్చిపోకూడని లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. పాక్ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని హితవు పలికారు.
పాకిస్తాన్ తనను తాను ఇస్లామిక్ దేశంగా ప్రచారం చేసుకునే ప్రయత్నాలు చేస్తోందనీ, అయితే ఇండియాలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, ఈ విషయాన్ని కూడా ప్రపంచ దృష్టికి మనం తీసుకెళ్లాలని ఒవైసీ అన్నారు.
ఇస్లాం శాంతి, సామరస్యానికి ప్రతిరూపం అని, పాకిస్థాన్ మాత్రం ఇస్లాం పేరుతో మారణహోమం సృష్టిస్తోందని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు.
భారత్లోని హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, భారత ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత రక్షణ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్కు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మద్దతు పలికారు.
Asaduddin Owaisi: ఆపరేషన్ సింధూర్కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలిపారు. పాకిస్థాన్లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత రక్షణ బలగాలు లక్ష్యంగా చేసుకున్న దాడులను తాను స్వాగతిస్తున్నానని అన్నారు.