TG News: కాంగ్రెస్ నేతలకు గుడ్న్యూస్.. కీలక కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ
ABN , Publish Date - May 29 , 2025 | 10:01 PM
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ శుభావార్త తెలిపింది. టీపీసీసీలో పలు కమిటీలను గురువారం ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు (Telangana Congress Leaders) ఏఐసీసీ (AICC) శుభావార్త తెలిపింది. టీపీసీసీలో పలు కమిటీలను ఇవాళ(గురువారం) ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రాజకీయ వ్యవహారాలు, సలహా, డీ లిమిటేషన్, సంవిధాన్ బచావో కార్యక్రమం, డిసిప్లీనరీ కమిటీలను ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్కు ఐదు కమిటీలను నియమించింది. 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని, 15 మందితో సలహా కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేసింది. ఈ రెండు కమిటీలకు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సారథ్యం వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో 'డీ లిమిటేషన్' కమిటీని, పి. వినయ్ కుమార్ చైర్మన్గా 16 మందితో సంవిధాన్ బచావ్ కార్యక్రమ కమిటీ, ఎంపీ మల్లు రవి నేతృత్వంలో ఆరుగురితో డిసిప్లీనరీ కమిటీలను ఏఐసీసీ నియమించింది.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై మల్లికార్జున్ఖర్గే, రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్ చర్చించారు. ఇవాళ వర్కింగ్ ప్రెసిండెట్లు, ప్రధాన కార్యదర్శుల జాబితాను ప్రకటించాలని ఏఐసీసీ భావించింది. వివిధ కోణాల్లో కూర్పు నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ విస్తరణకు, పీసీసీ ప్రధాన కార్యవర్గం ఏర్పాటుకు లింక్ చేసింది. తదుపరి రేవంత్రెడ్డితో సహా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులతో చర్చించిన అనంతరం కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఇతర అంశాలతో పాటు తెలంగాణ పీసీసీ కార్యవర్గ కూర్పుపై ముగ్గురు నేతలు చర్చించారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్
గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే
Read Latest Telangana News And Telugu News