Share News

Russia-India Ties : ఆపద వేళ రష్యాను ఆదుకున్న ఇండియా.. స్నేహమంటే ఇదేరా.. చూసి నేర్చుకోండి..

ABN , Publish Date - Feb 25 , 2025 | 08:15 PM

Russia-India Ties : మూడేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ దేశాలు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇరువైపులా లక్షల మంది మరణించారు. గాయపడ్డారు. ఉక్రెయిన్‌ను సాయమందిస్తూ అమెరికా, ఐరోపా దేశాలు యుద్ధాన్ని ఎగదోస్తూ రష్యా ఆర్థిక వ్యవస్థను నీరుగార్చేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. కానీ, అన్నింటినీ తట్టుకుని రష్యా సగర్వంగా నిలబడింది. ప్రపంచ దేశాలు ఊహించనిది చేసి చూపించింది. అదేంటంటే..

Russia-India Ties : ఆపద వేళ రష్యాను ఆదుకున్న ఇండియా.. స్నేహమంటే ఇదేరా.. చూసి నేర్చుకోండి..
Russia India China Economic Triangle

Russia-India Ties : మూడు ఏళ్లుగా కొనసాగుతున్న రక్తసిక్త సంగ్రామం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. మొదట్లో కొద్ది రోజుల వ్యవధిలో ముగిసిపోతుందనుకున్న ఈ యుద్ధం ఇప్పుడు అంతులేని తుపాకీ గోలగా మారిపోయింది. ఉక్రెయిన్ నాటో మద్దతుతో బతికేస్తుండగా.. రష్యా మాత్రం అసంఖ్యాకమైన ఆంక్షల మధ్యే తన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడంలో విజయం సాధించింది. ఆపద సమయంలో అండగా నిలిచి మాస్కోను ఒడ్డున పడేయడంతో ఇండియా కీలకపాత్ర పోషించడంతో.. ప్రపంచం ఊహించనిదే జరిగిపోయింది.


అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం, రష్యా 2023, 2024లో 3.6 శాతం GDP వృద్ధిని నమోదు చేసింది. 2021లో అంతర్జాతీయ కొనుగోలు శక్తి సమాన్యత (PPP) ఆధారంగా $5.73 బిలియన్లుగా ఉన్న GDP, 2022లో $6.06 బిలియన్లు, 2023లో $6.51 బిలియన్లు, 2024లో మరింత పెరిగి $6.91 బిలియన్లకు చేరింది. 500కు పైగా ఆంక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ, రష్యా తన ఆర్థిక చక్రాన్ని ముందుకు నడిపించగలిగింది. ఆంక్షలు విధించినప్పుడు, రష్యా పడిపోతుందని భావించారు, ఎందుకంటే దాని మొత్తం ఆర్థిక వ్యవస్థలో 42 శాతం వాణిజ్యానికి ఆధారపడి ఉంది. కానీ ప్రపంచం ఊహించని మలుపు తిరిగింది.


అండగా నిలిచిన చైనా-భారత్..

2025లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత, UN జనరల్ అసెంబ్లీలో అమెరికా రష్యా వైపు మొగ్గు చూపింది. దీంతో రష్యాపై ఒత్తిడి తగ్గింది. మరోవైపు, భారత్ పెద్ద ఎత్తున రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి, ఆ దేశాన్ని ఆదుకుంది. 2023లో రష్యా మొత్తం ఎగుమతులు $394 బిలియన్లకు చేరగా, అందులో అత్యధికంగా 32.7 శాతం ($129 బిలియన్) చైనాకు, 16.8 శాతం ($66 బిలియన్) ఇండియాకు వెళ్లాయి. 2021లో కేవలం 16 శాతంగా ఉన్న చైనా-భారత్ రష్యా ఎగుమతుల వాటా, 2023 నాటికి 50 శాతానికి పెరిగింది.


ఆపద నుంచి గట్టెక్కించిన ఇండియా..

రష్యా కోసం ప్రాణదాతగా మారింది క్రూడ్ ఆయిల్. ప్రపంచం రష్యా చమురును కొనుగోలు చేయడానికి వెనుకాడిన వేళ, చైనా దాని మొత్తం ముడి చమురు ఎగుమతులలో 50 శాతం, భారత్ 40 శాతం కొనుగోలు చేసింది. చైనా ఎప్పటి నుంచో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. కానీ భారతదేశం మాత్రం నూతన ఆటగాళ్లలో ఒకటిగా మారింది. 2013లో భారతదేశం రష్యా నుంచి దిగుమతులు చేసుకున్న వాటిలో కేవలం 1.83 శాతం మాత్రమే ముడి చమురుగా ఉండేది. 2021 నాటికి ఇది 12 శాతానికి పెరిగింది. అయితే యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి భారతదేశం దిగుమతిచేసుకున్న వాటిలో 74 శాతం ముడి చమురుగా మారింది. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థను కుదేలయ్యే ప్రమాదం నుంచి గట్టెక్కించింది.


ఇక యుద్ధరంగం పూర్తిగా మారిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రాగానే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై విమర్శల వర్షం కురిపించారు. ఈ పరిణామాలతో రష్యా మరింత ధైర్యంగా ముందుకు సాగుతోంది. యుద్ధానికి ముగింపు ఎక్కడ ఉందో తెలియదు. కానీ ఒక విషయం స్పష్టం.. రష్యా తన పోరాటాన్ని ఆపే ఉద్దేశంలో లేదు.


Read Also : France : వైద్యం ముసుగులో కామపిశాచం.. 299 మంది రోగులపై అత్యాచారం చేసిన దుర్మార్గుడు.. ఎక్కడంటే..

Vivek Ramaswamy: ఆ విషయంలో వివేక్‌కే మా మద్ధతు.. ట్రంప్, మస్క్..

Updated Date - Feb 25 , 2025 | 08:17 PM