Home » Narendra Modi
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జనాభా లెక్కల ప్రక్రియకు రూ. 11,718 కోట్ల బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా జనాభా, డెమోగ్రఫిక్ వివరాలు సేకరణకు సహాయపడుతుంది. ఇంకా..
సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ఓ పోస్టు పెట్టారు. రజనీ కలకాలం ఎంతో ఆరోగ్యంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థించారు.
లోక్సభలో వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై సోమవారం చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ వందేమాతర గీతం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. వందేమాతరంపై చర్చలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు.
గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిర్చ్ నైట్ క్లబ్లో సిలిండర్ పేలి 25 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శుక్రవారం పుతిన్ , ప్రధాని మోదీ మధ్య హైదరాబాద్ భవన్లో ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ భేటీలో ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాల గురించి చర్చ జరిగింది. అలానే ఇరుదేశాల స్నేహం మరింత బలపడే విధంగా వీరి చర్చ సాగినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే.. వీరి భేటీ సమయంలో ఇరు దేశాధినేతల మధ్యలో ఓ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతానని హెచ్చరించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు షాక్ ఇచ్చే న్యూస్ చెప్పారు. భారత్కు నిరంతరంగా ఇంధనాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ స్పష్టం చేశారు.
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధానితో భేటీ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. శాంతి స్థాపన కోసం ప్రధాని చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై ఏఐ వీడియోల పరంపర కొనసాగుతోంది. గతంలో ఆయన్ను కించపరుస్తూ పలు ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా చాయ్ అమ్ముతున్నట్లు ఉన్న ఏఐ వీడియోను కాంగ్రెస్ నాయకురాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో కాంగ్రెస్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో దేశ ప్రధాని నరేంద్ర మోదీది ప్రత్యేకమైన అనుబంధం. నరేంద్ర మోదీ 2014లో దేశ ప్రధాని అయిన తర్వాతే పుతిన్తో పరిచయం ఏర్పడిందని చాలా మంది అనుకుంటారు. అయితే అది నిజం కాదు. అంతకు 13 ఏళ్ల ముందే మోదీ, పుతిన్ మధ్య స్నేహం మొదలైంది.