Home » Narendra Modi
పెహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్నీ బద్ధలు కొట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్కీ బాత్ 121 వ ఎపిసోడ్లో ప్రధాని ప్రసంగించారు. పెహల్గామ్లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని నిరాశను ప్రతిభింభిస్తోందని అన్నారు.
Rahul Gandhi: భారత్ సమ్మిట్లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు’ అంటూ మండిపడ్డారు. ఉగ్రదాడి మృతులకు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు.
Chandrababu Naidu: పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమేరకు తన సంఘీభావాన్ని తెలిపారు.
Chandrababu Naidu: పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని, హింసను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. పహల్గామ్ బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలిపారు.
పహల్గాంలో అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదుల అంతం చూస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఉగ్రవాదులు, వారిని మద్దతు ఇచ్చే వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ ఉగ్రదాడిని భారత ఆత్మపై దాడిగా అభివర్ణించారు
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 1960లో కుదిరిన ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అటారీ చెక్పోస్టును తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు పాకిస్థాన్ పర్యాటకులు, పౌరులు వెంటనే వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.
పహల్గామ్లో ఉగ్రవాద ఘటన నేపథ్యంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించారు. తన సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని తాజాగా ఢిల్లీకి తిరిగొచ్చారు. ఆ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే, ఆయన అక్కడే అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు.
పహల్గామ్లో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని సౌదీ చేరుకున్నారు. కానీ ఉగ్రదాడి తర్వాత, ప్రధాని మోదీ ఈరోజు ఢిల్లీకి తిరిగి వచ్చారు.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. విదేశీయులు, భారతీయ పర్యాటకులు లక్ష్యంగా ఉగ్రవాదులు మతం అడిగి కాల్పులకు తెగబడ్డారు.