Home » Narendra Modi
సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ ఈనెల 15, 16 తేదీల్లో ఆ దేశంలో అధికారిక పర్యటన జరుపుతారు. రెండు దశాబ్దాలుగా ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం.
ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్షిపణి వ్యవస్థలు, మిలటరీ కమాండ్పై ఇజ్రాయెల్ శుక్రవారం నాడు భీకర దాడులు జరిపింది. 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో విజయవంతమైన దాడులు జరిపినట్టు నెతన్యాహు ప్రకటించారు. అయితే, ఈ ఉద్రిక్తతల నడుమ ఆయన ప్రధాని మోదీ ఫోన్ చేశారు.
వరంగల్కు చెందిన కొత్త జంటకు ప్రధాని నరేంద్ర మోదీ మర్చిపోలేని గిఫ్ట్ పంపించారు. దీంతో వధూవరుల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సామాన్య ప్రజల పట్ల ప్రధాని మోదీ చూపిన ప్రత్యేక శ్రద్ధపై జిల్లా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈడీ దాడుల ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను బీజేపీ టార్గెట్ చేసిందని, అయినప్పటికీ మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చీలికలు తేలేదని, పార్టీ ఐక్యంగా ఉందని మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.
ఈ పదకొండేళ్లలో ఆర్థిక పునరుద్ధరణ, సామాజిక న్యాయం, సాంస్కృతిక గౌరవం, జాతీయ భద్రతతో కొత్త శకాన్ని దేశం చూస్తోందని కేంద్ర హోమంత్రి అమిత్షా అన్నారు. బలమైన నాయకత్వం, దృఢ సంకల్పం, ప్రజాసేవ చేయాలనే తపన ఉంటే సుపరిపాలన సాధ్యమేనని మోదీ ప్రభుత్వం నిరూపించిందని వివరించారు.
భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు (Bangladesh India Relations) కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. తాజా పరిణామాలలో భాగంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇది ఇరు దేశాల బంధాన్ని మళ్లీ పెంచే సంకేతంగా మారింది.
Extreme Poverty Rate: 2022-2023 నాటికి దేశంలో అత్యంత పేదరికం రేటు భారీగా పడిపోయింది. 75.24 మిలియన్ల మంది మాత్రమే అత్యంత పేదవాళ్లు ఉన్నారు. 11 ఏళ్లలో ఏకంగా 269 మిలియన్ల మంది అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారు.
శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా ఇండియా-కెనడా గౌరవించుకుంటూ, పరస్పర ప్రయోజనాలు పొందే దిశగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాయని మోదీ చెప్పారు. జీ7 సదస్సులో మార్క్ కార్నీతో సమావేశానికి ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
The Chenab Railway Bridge: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని కట్టింగ్ ఎడ్జ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో నిర్మించారు. ఈ బ్రిడ్జి గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా కూడా ఏమాత్రం చెక్కు చెదరదు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తొలిసారి జమ్మూకశ్మీర్కు చేరుకున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ఉగ్రవాదం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.