Home » Russia
శుక్రవారం పుతిన్ , ప్రధాని మోదీ మధ్య హైదరాబాద్ భవన్లో ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ భేటీలో ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాల గురించి చర్చ జరిగింది. అలానే ఇరుదేశాల స్నేహం మరింత బలపడే విధంగా వీరి చర్చ సాగినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే.. వీరి భేటీ సమయంలో ఇరు దేశాధినేతల మధ్యలో ఓ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిపిన ద్వైపాక్షిక సమావేశానంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈ-టూరిస్ట్ వీసా, గ్రూప్ టూరిస్ట్ వీసా సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన భారత్లో రెండో రోజు కొనసాగుతోంది. ఇండియాలో పర్యటించేందుకు ఆయన నిన్న(గురువారం) సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. పుతిన్ పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ లైట్ అప్డేట్స్ కోసం ఇక్కడ చూడండి..
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధానితో భేటీ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. శాంతి స్థాపన కోసం ప్రధాని చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య భారీ రక్షణ, వాణిజ్య ఒప్పందాలు కుదురుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య రెండు బిలియన్ డాలర్ల విలువైన సబ్మెరిన్ డీల్ కుదరనుందని బ్లూమ్బర్గ్ వెల్లడించింది.
పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్కు ఐరోపాదేశాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. భారత్కు స్నేహితుడైన పుతిన్ యుద్ధం విరమించేలా నచ్చచెప్పాలంటూ ఐరోపా దేశాల ప్రతినిధులు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు.
భారత్, రష్యా దేశాలు మధ్య ఒక కీలక ఒప్పందానికి ఆమోదం లభించింది. రష్యా పార్లమెంట్ ఈ ట్రీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా మానవతా సహాయం, డిజాస్టర్ రిలీఫ్, జాయింట్ మిలటరీ ఎక్సర్సైజ్లు, శిక్షణ కార్యక్రమాలకు ఈ ఒప్పందం..
రష్యా ట్యాంకర్లపై దాడి జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్యాంకర్లపై దాడి జరిగిన వెంటనే అందులోని సిబ్బంది 'డ్రోన్ దాడి' అంటూ చెప్పడం వీడియోలో కనిపిస్తోంది.
రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్నెఫ్ట్, లోకోయిల్పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంక్షలు అమల్లోకి రావడంతో క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై స్విట్జర్ల్యాండ్ వేదికగా అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అయితే, చర్చలు మొదలైన కొన్ని గంటలకే ఉక్రెయిన్ అధ్యక్షుడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తమ ప్రయత్నాలపై ఉక్రెయిన్కు అసలు కృతజ్ఞతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.