Pahalgam Attack: పాక్ నేతలకు వరుస పెట్టి షాక్లు ఇస్తున్న ఇండియా..
ABN , Publish Date - May 04 , 2025 | 01:46 PM
India Blocks Pak Politicians Social Media Accounts: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్థాన్పై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. సింధు జలాల ఒప్పందం రద్దుతో అసహనంతో ఇండియాపై విషం కక్కుతున్న వారిపైనా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. దాయాది దేశంలోని రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు, నటులు ఇలా అందరికీ వరసపెట్టి షాకులిస్తోంది.

Imran Khan Bilawal Bhutto Social Media Accounts Blocked: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో 'ఎక్స్' ఖాతాలను భారతదేశంలో బ్లాక్ చేశారు. రెచ్చగొట్టేలా ఇష్టారీతిన మాట్లాడిన పాకిస్తాన్ సమాచార, ప్రసార శాఖా మంత్రి అతుల్లా తరార్ 'X' ఖాతాను కూడా నిషేధించారు. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ రానున్న 24 నుంచి 36 గంటల్లోగా తమ దేశంపై సైనిక దాడికి దిగుతుందని..ఇస్లామాబాద్కు విశ్వసనీయ నిఘా సమాచారం ఉందని రెండు రోజుల క్రితం తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
చట్టపరమైన డిమాండ్కు ప్రతిస్పందనగా భారతదేశంలో ఇమ్రాన్ ఖాన్, బిలావల్ భుట్టో X ఖాతాలు నిలిపేసినట్లు మెసేజ్ ఉన్న స్క్రీన్ షాట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్ రాజకీయ నాయకుల X ఖాతా ప్రొఫైల్ చిత్రం, కవర్ చిత్రం ఖాళీగా ఉండటాన్ని చూడవచ్చు.
ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఈ దాడిలో, నిషేధిత పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన 'ది రెసిస్టెన్స్ ఫోర్స్' (TRF) ఉగ్రవాదులు అమాయక పౌరులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ తరువాత అనేక మంది పాకిస్థాన్ రాజకీయ నాయకుల 'X' ఖాతాలు నిషేధించబడ్డాయి. ఇదే కాకుండా, హనియా అమీర్, మహిరా ఖాన్ సహా అనేక మంది పాకిస్థానీ నటుల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను కూడా భారతదేశం బ్లాక్ చేసింది.
Read Also: Pakistani Journalists Clash: పబ్లిక్గా ఒకరినొకరు తిట్టుకున్న పాక్ జర్నలిస్టులు
Sher Afzal Khan Marwat: భారత్తో యుద్ధం మొదలైతే నేను ఇంగ్లండ్ వెళ్లిపోతా.. పాక్ సీనియర్ నేత
Maldives: అధ్యక్షుడు ముయిజు వ్యాఖ్యలు సరికాదు.. ఇండియాకు క్షమాపణ చెప్పాలి.. మాజీ మంత్రి