Home » International News
నాటో నుంచి తప్పుకునే అంశాన్ని తమ దేశం పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై యుద్ధంలో నాటో దేశాలు తమకు సహకరించడం లేదని ట్రంప్ తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సహా ఆ దేశ ఉన్నతాధికారులు మంగళవారం 'ఇస్లామిక్ రిపబ్లిక్ డే' వేడుకల్లో భాగంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత బహిరంగంగా కనిపించారు.
కెనడాలో నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది ఇందర్జీత్ సింగ్ గోసాల్ గన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కెనడా కోర్టు ఆ ఆరోపణలను కొట్టేసింది. ఈ తీర్పు కారణంగా గోసాల్పై ఉన్న పలు అంక్షలు తొలగిపోతాయి.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి తీవ్ర తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఒకవైపు ఇరాన్ దాడులు, మరోవైపు హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఆర్థిక ఇబ్బందులు.. యూఏఈని కలవరపెడుతున్నాయి.
అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మొజ్తాబా ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. ఇరాన్ కొత్త సర్వోన్నత నాయకుడిగా నియమితులై దాదాపు నెల రోజులు గడిచినా, మొజ్తాబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు.
పశ్చిమాసియాలో నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకునేలా కనిపిస్తోంది. శాంతి చర్చలకు ఇప్పటికే అమెరికా మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ కూడా అదే తరహాలో స్పందించింది.
భారత సంతతికి చెందిన టెక్నాలజీ నాయకురాలు మంగళ కుప్పా యూఎస్ కార్మిక శాఖ ముఖ్య సమాచార అధికారిగా నియమితులయ్యారు. గతేడాది అక్టోబరు నుంచి తాత్కాలిక హోదాలో పనిచేసిన ఆమెకు పూర్తి స్థాయి సీఐవో బాధ్యతలు అప్పగించారు.
యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనంతో ఉన్నారా? హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు క్లిష్టమైన, భారీ స్థాయి దాడులు తప్పవని....
మార్క్ సుబ్బారావు నార్త్ కరొలినా రాష్ట్రం షార్లెట్లో ఉపాధ్యాయుల సుబ్బారావు, రెజీనా దంపతులకు జన్మించారు. న్యూజెర్సీలోని మోరిస్టౌన్లో హైస్కూల్ చదువు పూర్తి చేశారు.