Home » International News
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ యుద్ధ భయాందోళనలు మొదలయ్యాయి. శనివారం తెల్లవారుజామున మిడిల్ ఈస్ట్లో చోటుచేసుకున్న దాడులు (Israel Strikes Iran) ఈ ప్రశ్నను మళ్లీ వెలుగులోకి తెచ్చాయి. ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో మరో ఇద్దరు ప్రముఖ ఇరాన్ జనరల్స్ మృతి చెందారు.
అణు ఒప్పందంపై తమతో చర్చించేందుకు ఇరాన్కు చాలా అవకాశాలు ఇచ్చామని, అయినా టెహ్రాన్ అంగీకరించలేదని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడులను ప్రస్తావిస్తూ అద్భుతమైన దాడులు జరిగాయని, మరిన్ని బలమైన దాడులు పొంచి ఉన్నాయని ఇరాన్ను హెచ్చరించారు.
ఇజ్రాయెల్ మరోసారి భారీ వైమానిక దాడిని ప్రారంభించింది. ఇరాన్పై కొనసాగిన ఈ సర్జికల్ స్ట్రైక్స్లో దాదాపు 200 యుద్ధ విమానాలు మోహరించబడి, 100కి పైగా వ్యూహాత్మక లక్ష్యాలను కూల్చివేశాయి. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇరాన్ బలగాలు, మిలటరీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వరుస దాడులు జరిపింది. టెహ్రాన్లోని నాటాన్స్ యురేనియం ఎన్రిచ్మెంట్ కేంద్రంతోపాటు పలు మిలటరీ స్థావరాలపై ఈ దాడులు జరిగాయి.
వాషింగ్టన్లో శనివారం జరగనున్న 250వ ఆమెరికా ఆర్మీ డే ఉత్సవాలకు పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్కు ఆహ్వానం అందడం భారత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తనకు సవాళ్లు ఎదురవుతాయని భావిస్తే అమెరికా కచ్చితంగా భారత్ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త శాక్స్ తాజాగా హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో మొదలైన ఈ గొడవ.. టెస్లా అధినేత కొత్త పార్టీపై ప్రకటన చేసే వరకు వెళ్లింది.
ఇస్లామాబాద్ గత నెలలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి 2.4 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం పొందింది. 2025-26 బడ్జెట్ను రూపొందించే ముందు ఐఎంఎఫ్తో సంప్రదింపులు జరుపేందుకు కట్టుబడి ఉన్నట్టు ఇస్లామాబాద్ ప్రకటించింది.
రష్యాపై వెస్ట్ దేశాల ఆంక్షలు విధించినప్పుడు ఇండియా ఎందుకు చేరలేదని అడిగినప్పుడు, విభేదాలు యుద్ధంతో పరిష్కారం కావని తాము నమ్ముతామని జైశంకర్ చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య తలెత్తిన గొడవలు ఇక ఇద్దరి మధ్యా సంధి కుదరడం కష్టం కావచ్చనేంత వరకూ వెళ్లాయి. మస్క్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే ఈ ఉహాగానాలకు మస్క్ చెక్ పెట్టారు.