Minister Anam: తల్లికి వందనం పథకంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన
ABN , Publish Date - May 22 , 2025 | 05:41 PM
Minister Anam Ramanarayana Reddy: టీడీపీ కార్యకర్తలకు అండగా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఆత్మకూరులో సీఎం చంద్రబాబు రెండుసార్లు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

నెల్లూరు: ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వడివడిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు (CM Nara Chandrababu Naidu) అమలు చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని (Thalliki Vandanam Scheme) అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకం రూపొందించారు. విద్యార్థుల సంక్షేమం కోసం తల్లికి వందనం పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం రాష్ట్రంలో విద్యావ్యవస్థలను బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తుంది. ఈ క్రమంలో ‘తల్లికి వందనం’ పథకంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanarayana Reddy) కీలక ప్రకటన చేశారు. పాఠశాలలు మొదలుపెట్టే రోజున ‘తల్లికి వందనం’ పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15వేలు అందిస్తామని ప్రకటించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందని ఉద్ఘాటించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
ఆత్మకూరులో ఇవాళ(గురువారం) మినీ మహానాడు నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎనిమిది తీర్మానాలను మంత్రి ఆనం ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగిందని చెప్పారు. ఆత్మకూరులో సీఎం చంద్రబాబు రెండుసార్లు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
సోమశిల డ్యాం మరమ్మతులకు రూ.175 కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుదేనని గుర్తుచేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి . డ్యాం మెయింటెనెన్స్కి గ్రీసు కూడా ఇవ్వని స్థితిలో గత వైసీపీ పాలన సాగిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. ఆత్మకూరులో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని వందపడకల నుంచి 150 పడకలకు పెంచామని చెప్పుకొచ్చారు. సోమశిలలో 30 పడకల ఆస్పత్రిని సీఎం చంద్రబాబు మంజూరు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్ పథకాలు అమలు కాబోతున్నాయని స్పష్టం చేశారు. గతంలో పదివేల సభ్యత్వాలు కూడా లేని పరిస్థితుల నుంచి ఈరోజు లక్ష 50 వేల సభ్యత్వాలు చేసి రాష్ట్రంలో మూడో స్థానంలో నెల్లూరు జిల్లా నిలిచిందని అన్నారు. శాశ్వత సభ్యత్వాల్లో రాష్ట్రంలో రెండోస్థానంలో ఆత్మకూరు నియోజకవర్గం నిలిచిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి ఆనం అనుభవం ఉన్న నేత: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
టీడీపీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలే పార్టీకి బలమని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనుభవం ఉన్న నేత అని కొనియాడారు. ఆత్మకూరులో రూ.450కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. సోమశిల ప్రాజెక్ట్, రోడ్లు, కాలువలు వంటి చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆత్మకూరుకు మరిన్ని నిధులు తీసుకురావడానికి తనవంతుగా కృషి చేస్తానని... అభివృద్ధి ఇలాగే కొనసాగాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: ఇది మనందరి బాధ్యత.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Tirumala: తిరుమలలో ఓ వ్యక్తి బహిరంగంగా చేసిన పని చూస్తే
ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ
AP Ration Card: రేషన్కార్డులపై ఆందోళన వద్దు.. ఇది నిరంతర ప్రక్రియ
Read latest AP News And Telugu News