Share News

Nallapareddy Prasanna: నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసుల నోటీసులు..

ABN , Publish Date - Jul 22 , 2025 | 09:46 AM

మాకు భయమంటే ఏంటో తెలీదంటూ బీరాలు పోయిన వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Nallapareddy Prasanna: నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసుల నోటీసులు..
Police notice to Ex-MLA Nallapareddy Prasanna Kumar Reddy

నెల్లూరు: మాకు భయమంటే ఏంటో తెలీదంటూ బీరాలు పోయిన వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి(Former MLA Nallapareddy Prasanna Kumar Reddy)కి భారీ షాక్ తగిలింది. టీడీపీ మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యేకు కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న విచారణకి హాజరు కావాల్సిందిగా SI రంగనాథ్ గౌడ్ నోటీసులు అందజేశారు.


కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి(TDP MLA Vemireddy Prashanthi Reddy) వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ ఓ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నారు. అసభ్యకర పదజాలంతో మహిళా ఎమ్మెల్యేపై ప్రసన్నరెడ్డి ఆరోపణలు చేయడంపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు తనను తాను సమర్థించుకుంటూ ప్రసన్నకుమార్ స్టేట్ మెంట్ ఇవ్వడాన్ని ఖండిస్తూ.. బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. BNS లోని 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించారని ఆదేశాలు జారీ చేసింది.


ఇదిలా ఉంటే, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలో ఉంది నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రక్తం.. మాకు భయం అంటే ఏంటో తెలీదు. ఎంత దూరం వెళ్లేందుకైనా సిద్ధమని పేర్కొన్నారు. నేను ఎక్కడికీ పారిపోనని.. అవసరమైతే పోలీసులు ఇప్పుడే వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చని కామెంట్ చేశారు. కాగా, ప్రసన్నపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్ష పడేవని తెలుస్తోంది.


ఇవీ చదవండి..

సైట్‌ క్లియరెన్స్‌ కోసం ఏపీ దరఖాస్తు

ఏపీ, తెలంగాణలో తలసరి ఆదాయాల పెరుగుదల

For Telugu and Latest News

Updated Date - Jul 22 , 2025 | 04:13 PM