Home » Vemireddy Prashanthi Reddy
ఎన్టీఆర్ ఆలోచన నుంచే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టామని తెలిపారు. త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తి చేసి చెరువులన్నీ నింపుతామని స్పష్టంచేశారు.
మాకు భయమంటే ఏంటో తెలీదంటూ బీరాలు పోయిన వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు.
మహిళల పట్ల వైసీపీ నేతల తీరు సిగ్గుచేటని ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విమర్శించారు. మహిళల పట్ల వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత జగన్ మెప్పు, బిస్కెట్ల కోసం ఆ పార్టీ నేతలు అనిల్ కుమార్ ప్రసన్నకుమార్ రెడ్డి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని సినీ నటుడు కిరాక్ ఆర్పీ ధ్వజమెత్తారు. ఆడవాళ్ల జోలికొచ్చినా, కించపరిచినా బాగుపడే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ప్రసన్న, అనిల్ కుమార్ పతనం ప్రారంభమైందని కిరాక్ ఆర్పీ విమర్శించారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
ఎంతో సౌజన్యమూర్తులైన వేమిరెడ్డి దంపతులు ఈ అనిర్వచనీయమైన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని కొందరికే ఇవ్వడంతో... అన్ని ఆలయాలవారూ నెల్లూరు జిల్లా అంతటా ఈ గ్రంధం కోసం ఎదురు చూస్తున్నారని... ఇందులో పురాణపండ శ్రీనివాస్ అంత వైదికమైన, ఆలయాలకు అవసరమైన మంచి కంటెంట్ అందించారని నెల్లూరు అర్చక పండితులు స్పష్టం చేస్తున్నారు.
నెల్లూరు: నగరంలోని మాగుంట లేఔట్ ఎస్ఆర్కె స్కూల్లో కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రకభాకర్ రెడ్ది దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నామని అన్నారు.
కోవురు కేక పెట్టింది... వైసీపీకి దడపుట్టిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎక్కడికి పోయినా ఇదే జనం తమ సభలకు తరలి వస్తున్నారన్నారు. జగన్ పనైపోయిందని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు. అయితే వైయస్ జగన్ దోచుకోవాల్సింది దోచుకున్నానని.. దాచుకోవాల్సింది దాచుకున్నానని చేతులెత్తేశాడంటూ చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి నామినేషన్ దాఖలైంది. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లాలో తొలి నామినేషన్ వేశారు. కోవూరు కూటమి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు.
‘జయ జయోస్తు’ అద్భుత గ్రంధాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు, నెల్లూరు తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఆయన సతీమణి కోవూరు తెలుగుదేశం శాసన సభ అభ్యర్థి, టి.టి.డి. సలహామండలి చైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఆవిష్కరించడంతో అపురూప భక్తి సేవకు మరొకసారి నెల్లూరులో తెరలేచినట్లైంది