Share News

Minister Narayana: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో మంత్రి నారాయణ పర్యటన

ABN , Publish Date - Jun 10 , 2025 | 10:37 AM

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఇవాళ(మంగళవారం) పర్యటిస్తున్నారు. నిన్న(సోమవారం) రాత్రి మహారాష్ట్రలోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ని మంత్రి నారాయణ, అధికారులు సందర్శించారు.

 Minister Narayana: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో మంత్రి నారాయణ పర్యటన
AP Minister Narayana

అమరావతి: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ (AP Minister Narayana) ఇవాళ(మంగళవారం) పర్యటిస్తున్నారు. నిన్న(సోమవారం) రాత్రి మహారాష్ట్రలోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ని మంత్రి నారాయణ, అధికారులు సందర్శించారు. ప్రతి రోజూ చెత్త నుంచి 14 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్లాంట్‌లో విద్యుత్‌తో పాటు బయోగ్యాస్‌నూ ఉత్పత్తి చేస్తున్నట్లు మంత్రి నారాయణకు అధికారులు వివరించారు.


ప్లాంట్ పనితీరు, విద్యుత్ వినియోగంపై మంత్రి నారాయణకు పింప్రీ చించివాడ్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఏపీలో త్వరలో కొత్తగా రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లను నెలకొల్పుతున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో ప్లాంట్‌ల పరిశీలన ద్వారా బెస్ట్ మోడల్‌ను ఎంపిక చేయడంలో భాగంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నానని మంత్రి నారాయణ వివరించారు. ఈ రోజు(జూన్ 10) ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లు, చెత్త నిర్వహణ విధానాలను పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. మంత్రి నారాయణతో పాటు ప్లాంట్‌ల సందర్శనకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు వెళ్లారు.


ఈ వార్తలు కూడా చదవండి:

భద్రాద్రిలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు..

సంకెళ్లు వేసి.. నేలకు అదిమి..

For More AP News and Telugu News

Updated Date - Jun 10 , 2025 | 10:45 AM