Home » Minister Narayana
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఇవాళ(మంగళవారం) పర్యటిస్తున్నారు. నిన్న(సోమవారం) రాత్రి మహారాష్ట్రలోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ని మంత్రి నారాయణ, అధికారులు సందర్శించారు.
జగన్ పార్టీనే క్రిమినల్ మైండ్ పార్టీ అని మంత్రి నారాయణ విమర్శించారు. యావత్ దేశం సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు మాట్లాడిన మాటలను ఖండించాలని మంత్రి నారాయణ అన్నారు.
Machilipatnam Beach: మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్టివల్కు ఊహకు అందని విధంగా పర్యాటకులు వచ్చారని, బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. టూరిజం అభివృద్ధికి ఈ బీచ్ ఫెస్టివల్ తొలి మెట్టు అని, గతంలో బీచ్ ఫెస్టివల్ అంటే గోవాకు, శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చేదని... ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు.
మున్సిపల్ వర్కర్లకు జీతం పెంపు విషయంలో ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయి. మంత్రి నారాయణ మాట్లాడుతూ యూనియన్ ప్రతినిధులతో ముసాయిదా మరియు ఆర్థిక శాఖతో సలహాలు చేస్తామని తెలిపారు.
Minister Narayana: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై కూడా రుణాలు తెచ్చుకుందని అన్నారు. అమృత్ పథకానికి కేంద్రం ప్రభుత్వం నిధులిచ్చినా ఏపీ వాటా విడుదల చేయకపోవడంతో నిధులు విడుదల కాలేదని చెప్పారు.
Minister Narayana: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఏపీకి చాలా నష్టం చేశారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్థంగా పనులు చేశారని మంత్రి నారాయణ విమర్శించారు.
CM Chandrababu Naidu: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు. పర్యాటక శాఖ అధికారులతో సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
మూడేళ్లలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా జరపాలని, ఇక అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్ధేశించారు. సీఎం ఆదేశాల మేరకు పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
అమరావతి పునఃప్రారంభ సభ ఊహించిన దానికంటే అద్భుతంగా జరిగిందని మంత్రి నారాయణ అన్నారు. మోదీ పర్యటనతో ప్రజల్లో ఉత్సాహం రెట్టింపవడంతో సభ విజయవంతమైందని పేర్కొన్నారు
పదేళ్ల తర్వాత మళ్లీ మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు ప్రారంభమవుతుండటం ప్రజల్లో ఆశాజ్యోతి రగిలించింది. ప్రపంచ టాప్-5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది