Purandeswari: మోదీ పాలనపై పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:40 PM
దేశంలో అవినీతి రహిత పాలన ఉండాలని ప్రజలు భావించి తమను గెలిపిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశాన్ని పాలించగల సత్తా ఉందని ప్రజలు భావించి బీజేపీకి విజయాన్ని అందించారని చెప్పారు.

విజయవాడ: ఎన్డీఏ కూటమికి ప్రజలు మంచి విజయాన్ని అందించారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) భారతదేశానికి సుపరిపాలన, ధృడమైన నాయకత్వంతో మంచి పాలన అందిస్తున్నారని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ కేవలం అభివృద్ధి చెందిన భారత దేశమే కాదు ప్రతి సామాజికవర్గం ఎదుగుదల సాధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు పురందేశ్వరి.
ఇవాళ (మంగళవారం) విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. మోదీ నాయకత్వంలో దేశాన్ని పాలించగల సత్తా ఉందని ప్రజలు భావించి బీజేపీకి భారీ విజయాన్ని అందించారని చెప్పారు. సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్, సబ్ కా విశ్వాస్తో అన్ని లక్ష్యాలని ఛేదించాలనే ఉద్దేశంతో మోదీ పాలన కొనసాగిస్తున్నారని వివరించారు. దేశంలో అవినీతి రహిత పాలన ఉండాలని ప్రజలు భావించి బీజేపీని గెలిపిస్తున్నారని చెప్పుకొచ్చారు పురందేశ్వరి.
ఆంధ్రరాష్ట్రంలో గత జగన్ ప్రభుత్వం రాక్షస పాలనతో ప్రజలని ఇబ్బందులకి గురి చేశారని పురందేశ్వరి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చాక అభివృద్ధి దిశలో పాలన కొనసాగుతోందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందించటం అలాగే రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించారని పురందేశ్వరి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
భద్రాద్రిలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు..
For More AP News and Telugu News