Minister Kollu Ravindra: మసూల బీచ్ ఫెస్ట్.. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దది: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Jun 05 , 2025 | 07:36 PM
టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర ఉద్ఘాటించారు. గేట్ వే ఆఫ్ అమరావతిగా బందరును మార్చేందుకు మసూల బీచ్ ఫెస్ట్ ద్వారా అడుగులు వేశామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

మచిలీపట్నం: ఏపీలో బీచ్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) వ్యాఖ్యానించారు. మసూల బీచ్ ఫెస్టివల్ (Masula Beach Fest) ద్వారా తొలి అడుగు వేశామని తెలిపారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్లో ఇంత పెద్ద బీచ్ ఫెస్ట్ నిర్వహించడం గర్వంగా ఉందని తెలిపారు. దక్షిణ భారత దేశంలోనే మసూల బీచ్ ఫెస్ట్ అతి పెద్దదని అన్నారు. ఇవాళ(గురువారం) మసూల బీచ్ ఫెస్టివల్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు.
టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర ఉద్ఘాటించారు. 2018లో మసూల బీచ్ ఫెస్టివల్ అత్యంత ఘనంగా నిర్వహించామని.. కానీ గత వైసీపీ పాలకులు నాశనం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీచ్లోకి రావడానికి కూడా లేకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. గేట్ వే ఆఫ్ అమరావతిగా బందరును మార్చేందుకు ఈ ఫెస్ట్ ద్వారా అడుగులు వేశామని చెప్పారు. అమరావతిలోని అసెంబ్లీ నమూనాను ఫెస్టివల్కి వచ్చేవారికి కనువిందు చేసేలా ఏర్పాటు చేశామని వెల్లడించారు మంత్రి కొల్లు రవీంద్ర.
పింగళి వెంకయ్యని స్మరించుకుంటూ.. అతి పెద్ద జాతీయ జెండా ఏర్పాటు చేసుకున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే పండుగలో అడ్వెంచర్ స్పోర్ట్స్, పారా గ్లైడింగ్, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్తో సహా చాలా ఏర్పాట్లు చేశామని అన్నారు. దేశంలోని అన్ని రుచులు ఒకే చోట అందించబోతున్నామని చెప్పుకొచ్చారు. స్వదేశీ దర్శన్ కింద నిధులు తీసుకొచ్చి టూరిజం అభివృద్ధికి అధికారులు సహకారం అందించాలని కోరారు. హోటల్స్, రిసార్ట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. బందరు పోర్టుని పూర్తి చేసి బందరు భవిష్యత్తుని మారుద్దామని పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు విచ్చేసిన వారికి మన ఆతిథ్యం ఎలా ఉంటుందో చూపిద్దామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు
కాగా, మంగినిపూడి బీచ్లో ఇవాళ్టి(గురువారం) నుంచి నాలుగురోలపాటు మసూల బీచ్ ఫెస్టివల్ జరుగనుంది. జాతీయ జెండా ఆవిష్కరణ, క్రీడాకారులతో మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్ భారీ ర్యాలీ నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. బీచ్ ఫెస్టివల్లో బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, కయాకింగ్ వంటి పోటీలు నిర్వహించనున్నారు. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా 80 అడుగుల అమరావతి ముఖద్వారం, పర్యాటకులని ఆకర్షిస్తూ పలు రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను మచిలీపట్నం వాసులు, టూరిస్టులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. బీచ్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా హెలీరైడ్, పారాగ్లేడింగ్, స్పీడ్ బోటింగ్ ఏర్పాటు చేశారు. బీచ్ ఫెస్టివల్లో 22 రాష్ట్రాల నుంచి 4000 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. బీచ్ ఫెస్టివల్తో మచిలీపట్నం, చిలకలపూడి బీచ్లో సందడి వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి
మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవ్వండి.. సీఎం చంద్రబాబు పిలుపు
జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం
Read Latest AP News And Telugu News